Hanuman: ఈ సంక్రాంతి పండుగకు పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాగా విడుదలైన “హనుమాన్” అన్నిటికంటే అతి పెద్ద విజయం సాధించింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా మహేష్ బాబు “గుంటూరు కారం” సినిమాతో పాటు విడుదలయ్యి బ్లాక్ బస్టర్ హీట్ అయింది. విడుదలైన అన్నిచోట్ల పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని.. రికార్డు స్థాయి కలెక్షన్స్ రాబడుతుంది. ఈ సినిమాతో తేజ సజ్జా అతిపెద్ద విజయాన్ని అందుకోవటం జరిగింది. విడుదలై 10 రోజులు కాకముందే 150 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. అతి తక్కువ బడ్జెట్లో దర్శకుడు ప్రశాంత్ వర్మ అద్భుతమైన కంటెంట్ విజువల్ వండర్ “హనుమాన్” లో చూపించడం జరిగింది.
సంక్రాంతి సమయంలో విడుదల కావడంతో “హనుమాన్” సినిమాకి మొదట థియేటర్లు పెద్దగా లభించలేదు. అదే సమయంలో పెద్ద సినిమాలు విడుదల కావడంతో వాటికి కేటాయించడం జరిగింది. కానీ “హనుమాన్” సినిమా అన్ని సినిమాల కంటే అతిపెద్ద విజయం సాధించటంతో ఇప్పుడు.. చాలా చోట్ల “హనుమాన్” కి థియేటర్స్ కేటాయించే పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే ఇప్పుడు హనుమాన్ కి సీక్వెల్ గా “జై హనుమాన్” సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని మొదటి పార్ట్ చివరిలోనే సస్పెన్స్ లో పెట్టి రివిల్ చేయడం జరిగింది.
దీంతో “జై హనుమాన్” ప్రాజెక్ట్ పై ప్రేక్షకులలో చాలా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. “జై హనుమాన్” సినిమాలో స్టార్ హీరో నటిస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రశాంత్ వర్మ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..”సీక్వెల్ లోను తేజ సజ్జా.. హనుమంతు పాత్రలో నటిస్తారని స్పష్టం చేయడం జరిగింది. కానీ అతని హీరో కాదు ఆంజనేయస్వామి..హీరో అని అన్నారు. అయితే ఆ పాత్రను ఓ స్టార్ హీరో చేయబోతున్నట్లు చెప్పుకొచ్చారు. 2025లో “జై హనుమాన్” సినిమా విడుదలవుతుందని పేర్కొన్నారు. ఆ సినిమా రాకముందు అధీర, మహాకాళి అనే సినిమాలు చేయనున్నట్లు ప్రశాంత్ వర్మ తెలియజేశారు.
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!