LK Advani: బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ (96)కి దేశంలోనే అత్యున్నత పురస్కారం వరించింది. అద్వానీకి భారతరత్న అవార్డు ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం ప్రకటించింది. 90వ దశకంలో ఉన్న బీజేపీ తొలి తరం నేత ఎల్ కే అద్వానీకి భారతరత్న పురస్కారం లభించడంతో ఆ పార్టీ శ్రేణులు, అభిమానిలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎక్స్(ట్విట్టర్) వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎల్ కే అద్వానీజీకి భారతరత్న ఇస్తున్నారనే వార్తను పంచుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. తాను కూడా ఆయనతో మాట్లాడి ఈ గౌరవం పొందినందుకు అభినందించానన్నారు. ఎల్కే అద్వానీ రాజనీతిజ్ఞుడు, భారతదేశ అభివృద్ధిలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారని కొనియాడారు.
అద్వానీ చాలా కింద స్థాయి నుండి ఉప రాష్ట్రపతి వరకూ ఎదిగారని అన్నారు. అనేక కేంద్ర మంత్రి పదవులు నిర్వహించారన్నారు. పార్లమెంట్ లో ఆయనకు ఎంతో అనుభవం ఉందని అన్నారు. ఆయన పార్లమెంటరీ జోక్యాలు ఎప్పుడూ అదర్శప్రాయమైనవనీ, గొప్ప అంతర్ధృష్టులతో నిండి ఉన్నాయని పీఎం నరేంద్ర మోడీ శ్లాషించారు.
1927 నవంబర్ 8న ప్రస్తుత పాకిస్థాన్ (భారత్ విభజన కాకముందు)లోని కరాచీలో జన్మించిన ఎల్కే అద్వానీ అక్కడి సెయింట్ పాట్రిక్స్ హైస్కూల్ లో ప్రాధమిక విద్యను అభ్యసించారు. ఆ తర్వాత పాక్ లోని హైదరాబాద్ డీజీ నేషనల్ కాలేజీలో న్యాయ విద్యను పూర్తి చేశారు. 1947లో ఆర్ఎస్ఎస్ కరాచీ విభాగం కార్యదర్శిగా పని చేశారు. బీజేపీ వ్యవస్థాపకుల్లో అద్వానీ కూడా ఒకరు. నేడు దేశ వ్యాప్తంగా బీజేపీ విస్తరించడానికి, రెండు సార్లు అధికారంలోకి రావడానికి కూడా అద్వానీ చేసిన కృషి ఎంతో ఉంది. ఆయన చేపట్టిన రథయాత్రతో భారత్ దేశంలోనే హిందూ ఓట్లను పార్టీ పోలరైజ్ చేయగలిగింది.
I am very happy to share that Shri LK Advani Ji will be conferred the Bharat Ratna. I also spoke to him and congratulated him on being conferred this honour. One of the most respected statesmen of our times, his contribution to the development of India is monumental. His is a… pic.twitter.com/Ya78qjJbPK
— Narendra Modi (@narendramodi) February 3, 2024