Raviteja: ఫిబ్రవరి 9వ తారీకు శుక్రవారం మాస్ మహారాజా రవితేజ నటించిన ఈగల్ సినిమా విడుదల అయింది. సంక్రాంతి పండుగకు రావలసిన ఈ సినిమా కొన్ని అన్నివార్యాల కారణాలవల్ల నేడు రిలీజ్ అయింది. మొదటి రోజే పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడం జరిగింది. మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు రెండో భాగం కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. రవితేజని చాలా అద్భుతంగా కొత్తగా ఈ సినిమాలో చూపించారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ సినిమాకి చాలా హైలైట్ గా నిలిచింది. దీంతో ఈ సినిమా నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఫుల్ హ్యాపీగా ఉన్నారట. ఇదిలా ఉంటే ఈగలు సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు త్రివిక్రమ్ లపై టీజీ విశ్వ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాను అమెరికాలో ఉండేటప్పుడు ప్రతి గురువారం సాయంత్రం సినిమాకి వెళ్లే అలవాటు ఉందని చెప్పుకొచ్చారు. ఆ వీకెండ్లలో ఎన్ని సినిమాలు రిలీజ్ అయితే అన్ని సినిమాలు ఏది మొదలు పెట్టకుండా బ్యాక్ టు బ్యాక్ చూసేవాడిని. అలాగే సినిమాల మీద ఇంట్రెస్ట్ పెరిగింది. దీంతో ఒక సినిమా ఎంత మనీ కలెక్ట్ చేసింది అనేదాన్ని కన్న ఎంతమందికి రీచ్ అయింది అనేదాన్ని బట్టి సినిమా సక్సెస్ రేటింగ్ ఉంటుంది అని అన్నారు. ఇండస్ట్రీలో వీలైనంత మంది హీరోలతో సినిమాలు చేయాలని ఉందని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఎప్పుడు అనుకూలంగా ఉంటే అప్పుడు సినిమాలు చేయటానికి సిద్ధం.
త్రివిక్రమ్ మరియు పవన్ ఎప్పుడు ఫ్రీ అయితే అప్పుడు వాళ్లతో సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. అయితే అదే కాంబినేషనా… కోలాబరేషన్ అనేది వాళ్ళ కమిట్మెంట్స్ బట్టి ఉంటుంది అని చెప్పుకొచ్చారు. ఒక తెలుగులో మాత్రమే కాదు తమిళంలో కూడా సినిమాలు నిర్మిస్తున్నట్లు టీజీ వెంకటేష్ స్పష్టం చేశారు. గత ఏడాది సముద్రఖని దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, సాయి ధరంతేజ్ కలిసి నటించిన “బ్రో” నీ టీజీ విశ్వప్రసాద్ నిర్మించడం జరిగింది. అయితే ఇప్పుడు మరోసారి పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి రెడీగా ఉన్నట్లు కామెంట్లు చేయడం సంచలనంగా మారింది.