Yatra 2: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణం అనంతరం వైఎస్ జగన్ రాజకీయ జీవితంలో చోటు చేసుకున్న సంఘటనల ఆధారంగా “యాత్ర 2” సినిమా చేయడం జరిగింది. మహి వి రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి రోజు పాజిటివ్ టాక్స్ సొంతం చేసుకోవడం జరిగింది. ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్ల విషయానికొస్తే వరల్డ్ వైడ్గా మొదటి రోజు రూ. 1.65 కోట్ల షేర్ కలెక్షన్స్ రాగా రూ. 3.30 కోట్ల గ్రాస్ కలెక్ట్ అయినట్లు సమాచారం. తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత కాంగ్రెస్ పెట్టిన ఇబ్బందులు, ఓదార్పు యాత్ర వంటి సన్నివేశాలు చాలా అద్భుతంగా చూపించారు. ఈ క్రమంలో ఓదార్పు యాత్ర చేసే సమయంలో ప్రజల భావోద్వేగాలను వెండితెరపై హృదయాన్ని హత్తుకునేలా ఉన్నాయి.
వైఎస్ జగన్ పాత్రలో తమిళనాడు జీవా అద్భుతమైన నటన కనపరిచారు. ఓదార్పు యాత్ర తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన ఇబ్బందులు ఆ సమయంలో వైఎస్ జగన్ వాటిని ఎదుర్కొని వైసీపీ పార్టీని స్థాపించిన విధానం వంటివి కళ్ళకి కట్టినట్లు “యాత్ర 2″లో చూపించడం జరిగింది. అక్రమ కేసులలో జగన్ జైలు జీవితం ఎలా గడిపారు అనేది కూడా ఎమోషనల్ గా చూపించారు. ఆ తర్వాత 2014 ఎన్నికలలో ఓటమి చెందటం తర్వాత 2019 ఎన్నికలలో గెలవడం అంతకు ముందు చేసిన పాదయాత్ర వంటివి చాలా బాగా చిత్రీకరించడం జరిగింది. వైయస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో మమ్ముట్టి నటించగా.. జగన్ పాత్రల జీవా అచ్చు గుద్దినట్టు పాత్రలో పరాకాయ ప్రవేశం చేశారు.
వైయస్సార్…. జగన్ మధ్య ఉండే సన్నివేశాలను ప్రజలను కూడా భావోద్వేగానికి గురయ్యేలా సినిమాలో సన్నివేశాలు ఉన్నాయి. తెలుగు రాజకీయాలలో చాలామంది నేతలను ఇందులో చూపించడం జరిగింది, మొదటి రోజే “యాత్ర 2″కి వరల్డ్ వైడ్గా మొదటి రోజు రూ. 1.65 కోట్ల షేర్ కలెక్షన్స్ రాగా రూ. 3.30 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రావటం సంచలనంగా మారింది. 2019 ఎన్నికలలో సరిగ్గా ఫిబ్రవరి 8వ తారీకు “యాత్ర” విడుదల అయ్యి సూపర్ హిట్ అయ్యింది. ఆ ఎన్నికలలో అఖండ మెజారిటీతో జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు 2024 ఎన్నికలకు ముందు సరిగ్గా అదే తేదీ నాడు “యాత్ర 2” హిట్ కావటంతో వైసీపీ ఫ్యాన్స్ సెంటిమెంట్ గా ఫీల్ అవుతున్నారు.