Allu Arjun: 2021లో విడుదలైన “పుష్ప” సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలుసు. పాన్ ఇండియా నేపథ్యంలో విడుదలైన “పుష్ప” దేశాన్ని కాదు ప్రపంచాన్ని ఒక ఊపు ఊపింది. చిన్నలు మొదలుకొని పెద్దల వరకు సినిమాలో డైలాగులు పాటలకు స్టోరీకి బాగా కనెక్ట్ అయ్యారు. ముఖ్యంగా అల్లు అర్జున్ మేనరిజమ్స్ అందరినీ ఆకట్టుకోవడం జరిగింది. ఈ సినిమాకి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు కూడా రావడం జరిగింది. మ్యూజిక్ పరంగా కూడా దేవిశ్రీప్రసాద్ అవార్డు అందుకున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల జర్మనీలో బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్ కి అల్లు అర్జున్ అతిథిగా వెళ్లడం జరిగింది.
ఇండియా నుంచి వెళ్లిన నటీనటుల అందరిలో కల్లా ఎక్కువ ప్రాధాన్యత “పుష్ప” సినిమాకి దక్కటం జరిగింది. ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ తెలియజేయడం జరిగింది. అంతేకాదు ఈ ప్రఖ్యాత ఫిలిం ఫెస్టివల్ లో “పుష్ప” చిత్రం షో రీల్ ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్నారు. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో ఉన్న ఈ రీల్ చివర్లో.. “పుష్ప 2” ద రూల్ సినిమా సీన్స్ కూడా జోడించారు. ఈ షో రీల్ బన్నీ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం “పుష్ప-2” సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా పైన కూడా భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ ఏడాది ఆగస్టు 15న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే విధంగా చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. ఇలాంటి సమయంలోనే “పుష్ప” సినిమా బెర్లిక్ ఫిలిం ఫెస్టివల్ లో భాగంగా స్పెషల్ స్క్రీనింగ్ పడటం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.
దీంతో “పుష్ప” సినిమాకి దక్కిన అరుదైన గౌరవంతో అల్లు అర్జున్ అభిమానులు సైతం ఆనందాన్ని తెలియజేస్తున్నారు. రష్మిక కూడా ఈ చిత్రంలో ఢీ గ్లామరస్ గా కనిపిస్తోంది. అలాగే అనసూయ, ఫహద్ ఫాజిల్, సునీల్ తదితర నటీనటులు ఇందులో కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. అప్పుడప్పుడు “పుష్ప-2” చిత్రానికి సంబంధించి పలు రకాల లీకైన ఫోటోలు సినిమాపై ఆసక్తినీ పెంచయడం జరిగింది. ఏది ఏమైనా “పుష్ప” సినిమా విడుదలైనప్పటి నుంచి అల్లు అర్జున్ గ్రాఫ్ రోజురోజుకీ పెరుగుతున్నే ఉంది. ఇప్పుడు రాబోతున్న “పుష్ప -2” సినిమా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.