Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల జర్మనీ దేశం వెళ్లడం తెలిసిందే. అక్కడ బెర్లిన్ అంతర్జాతీయ సినిమా వారోత్సవాలలో బన్నీ పాల్గొనడం జరిగింది. “పుష్ప” సినిమాతో బన్నీ ఇమేజ్ ప్రపంచ నలుమూలలకు వ్యాపించడం జరిగింది. ఈ సినిమా ద్వారా అల్లు అర్జున్ గ్లోబల్ స్టార్ గా అవతరించారు. అంతేకాదు ఈ సినిమా ద్వారా అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్ గా జాతీయ అవార్డు కూడా సంపాదించడం జరిగింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉత్తమ జాతీయ నటుడు అవార్డు అందుకున్న తొలి హీరోగా అల్లు అర్జున్ రికార్డ్ చేశారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది. “పుష్ప” సినిమా పాటలు డైలాగులు హీరో మేనరిజం అందరిని ఆకట్టుకోవటం జరిగింది.
ముఖ్యంగా సినిమాలో తగ్గేదేలే డైలాగ్ విపరీతంగా ఆదరణ సంపాదించుకోవడం జరిగింది. అయితే బెర్లిన్ లో జరిగిన ఫిలిం ఫెస్టివల్ లో “పుష్ప” సినిమాకి సంబంధించి రైలు ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఇదే సమయంలో “పుష్ప 2” పార్ట్ కి సంబంధించి షూటింగ్ సన్నివేశాలు ప్రదర్శించడం జరిగింది. ఈ క్రమంలో అక్కడ బీబీసీ అంతర్జాతీయ ఛానల్ కి అల్లు అర్జున్ ఇంటర్వ్యూ ఇచ్చారు. పుష్ప సెకండ్ పార్టీ గురించి ఇంకా అనేక విషయాలు గురించి తెలియజేశారు. ఇదే సమయంలో “పుష్ప” ది రైజ్. ఇండియా ఆన్ ది రైజ్. ఇండియా గోయింగ్ టు రూల్.. ప్రపంచాన్ని త్వరలో భారతదేశం శాసించబోతుంది.
ఇండియా రాబోయే 10 నుండి 15 సంవత్సరాలలో అగ్రరాజ్యంగా అవతరించబోతుంది అంటూ “పుష్ప” సినిమా గొప్పదనం గురించి తెలియజేస్తూ దేశం యొక్క గొప్పతనాన్ని కూడా.. ఇంటర్నేషనల్ ఛానల్ ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ చాటి చెప్పారు. “పుష్ప” మొదటి భాగం సూపర్ డూపర్ హిట్ కావడంతో రెండో భాగం దానికంటే అదిరిపోయే రేంజ్ లో దర్శకుడు సుకుమార్ తీస్తున్నారు. మొదటి భాగం కంటే రెండో భాగం అత్యధికమైన భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఈ ఏడాది ఆగస్టు 15వ తారీకు “పుష్ప” సెకండ్ పార్ట్ రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా కోసం దేశం మాత్రమే కాదు ప్రపంచం మొత్తం ఎదురు చూస్తూ ఉంది.