Pushpa 2: సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న “పుష్ప 2” షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ ఏడాది ఆగస్టు 15వ తారీకు సినిమా రిలీజ్ డేట్ అధికారికంగా ఖరారు చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితులలో చెప్పిన సమయానికి “పుష్ప 2” విడుదల చేయాలని మేకర్స్ డిసైడ్ కావటం జరిగింది. ఇదిలాఉండగా ‘పుష్ప 2’ మూవీలో బాలీవుడ్ నటి “యానిమల్” హాట్ బ్యూటీ త్రిప్తి దిమ్రీ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఓ అతిథి పాత్రలో ఆమె కనిపించనున్నట్లు సమాచారం. పుష్పరాజ్ అనుచరుడిని ట్రాప్ చేయించి చంపించే పాత్రలో త్రిప్తి నటిస్తున్నట్లు టాక్. దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.
సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్నారు. గత ఏడాది సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన “యానిమల్” చిత్రం సూపర్ డూపర్ హిట్ కావటం తెలిసిందే. ఈ సినిమాలో త్రిప్తీ దిమ్రి తన అంద చందాలతో రణబీర్ కపూర్ తో రొమాంటిక్ సన్నివేశాలలో చెలరేగిపోయింది. ఈ సినిమాతో త్రిప్తీకి మంచి ఇమేజ్ రావడం జరిగింది. దీంతో “పుష్ప 2” సినిమాలో అవకాశం వచ్చినట్లు సమాచారం. 2021లో “పుష్ప” సినిమా రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ కావటం తెలిసిందే. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా “పుష్ప” ట్రెండ్ సెట్టర్ సినిమాగా నిలిచింది.
సినిమాలో పాటలు, డైలాగ్స్ మరియు డాన్స్ అన్ని కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడం జరిగింది. శ్రీవల్లి సాంగ్ లో స్టెప్, తగ్గేదేలే డైలాగ్ ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. సుకుమార్ బన్నీ కలయిక లో వచ్చిన ఈ మూడో సినిమా. పాన్ ఇండియా నేపథ్యంలో విడుదలైన ప్రతి భాషలో సూపర్ హిట్ అయింది. హిందీలో ఎలాంటి ప్రమోషన్స్ చేయకపోయినా 100 కోట్లు కలెక్ట్ చేయడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. దీంతో “పుష్ప” రెండో భాగం ఇప్పుడు.. మొదటి భాగం కంటే ఎక్కువ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు.