Tamilisai: తెలంగాణ గవర్నర్ పదవికి తమిళి సై రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆమె రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదించారు. తెలంగాణ గవర్నర్ గా ఝార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణ కు అదనపు బాధ్యతలు అప్పగించారు. అలానే పుదుచ్చేరి లెప్టినెంట్ గవ ర్నర్ గా కూడా ఆయనకు అనదపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్రపతి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.
కొత్త గవర్నర్ నియామకం చేపట్టాలంటే ఎన్నికల కోడ్ అడ్డంకి గా మారడంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము .. తమిళి సై స్థానంలో రాధాకృష్ణన్ కు అదనపు బాధ్యతలు అప్పగించినట్లుగా తెలుస్తొంది. తాత్కాలికంగానే బాధ్యతలను అప్పగించినట్లుగా తన ఉత్తర్వులో పేర్కొన్నారు. పూర్తి స్థాయి గవర్నర్ నియామకం జరిగే వరకూ రాధాకృష్ణన్ తెలంగాణ కు ఇన్ చార్జి గవర్నర్ గా బాధ్యతలను నిర్వహించనున్నారు.
క్రియాశీల రాజకీయాల్లోకి వెళ్లేందుకు తమిళి సై గవర్నర్ పదవికి రాజీనామా చేసినట్లుగా వార్తలు వినబడుతున్నాయి. లోక్ సభ ఎన్నికల షెడ్యుల్ విడుదల అయిన నేపథ్యంలో తమిళి సై తన సొంత రాష్ట్రం తమిళనాడులో పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేయనున్నట్లు సమాచారం. గతంలో తమిళి సై తమిళనాడులో మూడు పర్యాయాలు అసెంబ్లీకి, రెండు సార్లు లోక్ సభకు పోటీ చేసి పరాజయం పాలైయ్యారు.
Breaking: భారీ ఎన్కౌంటర్ .. నలుగురు మావో అగ్రనేతల హతం