Breaking: తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దులో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో నలుగురు మావోయిస్టు అగ్రనేతలు హతమైయ్యారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. తెలంగాణ సరిహద్దు నుండి మహారాష్ట్రలోకి ప్రవేశిస్తుండగా, భద్రతా బలగాలు వీరిని చుట్టుముట్టాయి. దీంతో ఎదురుకాల్పులు జరిగాయి.
మృతి చెందిన మావోయిస్టులంతా తెలంగాణ కమిటీకి చెందిన కీలక నేతలుగా గుర్తించారు. వీరిలో ఇద్దరిపై రూ.36 లక్షల రివార్డు ఉన్నట్లు సమాచారం. మృతులను మంచిర్యాల డివిజన్ కమిటీ సెక్రటరీ వర్గీస్, చెన్నూరు ఏరియా కమిటీ సెక్రటరీ మగ్తూ, కుర్సంగ్ రాజు, కుడిమెట్ట వెంకటేశ్ లుగా గుర్తించారు.
ఘటనా స్థలంలో ఏకే – 47, తుపాకులు, ఇతర పేలుడు పదార్ధాలు స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఎదురుకాల్పుల నుండి తప్పించుకుని పారిపోయిన మిగిలిన వారి కోసం భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. వారి కోసం అడవిలో గాలిస్తున్నారు. దీంతో ఏజన్సీ ప్రాంతంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
MLC Kavitha: కవితను అందుకే అరెస్టు చేశాం .. అధికారికంగా ఈడీ ప్రకటన