Rameswaram Cafe Blast Case: బెంగళూరులో రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం అయిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు కారణమైన నేరస్తులను పట్టుకునేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) రంగంలోకి దిగింది. ఈ పేలుడు లో ఓ బీజేపీ కార్యకర్తకు సంబంధం ఉన్నట్లుగా తాజా పరిణామాలు ద్వారా తెలుస్తొంది.
శివమొగ్గ జిల్లా తీర్ధహళ్లిలోని బీజేపీ కార్యకర్త సాయి ప్రసాద్ ను ఎన్ఐఏ విచారిస్తున్నట్లుగా సమాచారం. రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో ఇద్దరు అనుమానితులతో సాయిప్రసాద్ కు సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో ఎన్ఐఏ అతన్ని అదుపులోకి తీసుకుని ఇంటరాగేట్ చేస్తున్నట్లు తెలుస్తొంది.
రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు కేసుకు సంబంధించి పది రోజుల క్రితం ఎన్ఐఏ పలు ఇళ్లు, దుకాణాలపై దాడులు నిర్వహించి పత్రాలు స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో పలువురు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయడానికి జరిగిన కుట్రగా పలువురు భావిస్తూ పోస్టులు పెడుతున్నారు. బీజేపీ కార్యకర్తను సాక్షిగా విచారిస్తున్నారని, నిందితుడుగా కాదని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఎన్ఐఏ దర్యాప్తులో పూర్తి విషయాలు తెలిసే అవకాశం ఉంది.
Janasena: పవన్ ఉత్తరాంధ్ర పర్యటన ఖరారు
NIA has interrogated a BJP leader in Thirthahalli, Shivamoga, in connection with the Rameswaram Cafe blast case in Bengaluru.
Don't be surprised that it's linked to BJP.
Remember how fast bhakts jumped & abu$ed congress govt in Karnataka .#RameshwaramCafe— Dr Jwala Gurunath (@DrJwalaG) April 5, 2024