ధోని ఈ సినిమాతో మంచి పేరు సంపాదించిన బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్నాడు. ముంబైలో తన నివాసంలో సుశాంత్ సింగ్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకు సూసైడ్ చేసుకున్నాడో అన్న దాని గురించి కారణం ఇంకా బయటకు రాలేదు. ఒక్కసారిగా ఈ న్యూస్ బయటికి రావటం తో బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం షాక్ కి గురయ్యింది. భారత్ టీం కూల్ కెప్టెన్ ఎంఎస్ ధోని సినిమాతో సుశాంత్ సింగ్ దేశ వ్యాప్తంగా పాపులర్ అయ్యాడు.
2008వ సంవత్సరంలో ఓ సీరియల్ ద్వారా బుల్లి తెరకు పరిచయమై మెల్ల మెల్లగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడం జరిగింది. మొదటి సినిమా కై పో చెయ్ తో ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు. నటుడిగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కి మంచి గుర్తింపు రావడంతో శుద్ధ్ దేశీ రొమాన్స్, ఎంఎస్ ధోని, కేదారనాథ్, చిచ్చోరె సినిమాల్లో నటించి మెప్పించారు. ఇదిలా ఉండగా కొద్ది రోజుల క్రితమే సుశాంత్ సింగ్ మాజీ మేనేజర్ దిశా సలిన్ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కాగా ఇంత లోనే సుశాంత్ సింగ్ సూసైడ్ చేసుకోవడం తో బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా షాక్ అయ్యింది. ఈ నేపథ్యంలో మొదట మేనేజర్ తర్వాత సుశాంత్ సింగ్ చనిపోవటంతో ఈ రెండిటి మధ్య లింక్ ఏదో ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.