YS Jagan : ప్రభుత్వ పాఠశాల schools ల్లో విద్యార్థి student ఎవరైనా తరగతులకు హజరు కాకపోతే యాప్ ద్వారా గైర్జాజరైన విద్యార్థుల తల్లిదండ్రులకు సందేశం వెళ్లాలనీ, రెండవ రోజు నేరుగా వారి ఇంటికి వాలంటీర్ ను పంపి వివరాలు తెలుసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి విద్యాశాఖ అధికారులకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మన బడి “నాడు – నేడు” కార్యక్రమంపై బుధవారం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. విద్యార్థుల హజరు పై యాప్ ను రూపొందించారా? లేదా? అని అధికారులను జగన్ ప్రశ్నించారు. దీనిపై అధికారులు సమాధానం ఇస్తూ ఫిబ్రవరి 15 వ తేదీ నుండి విద్యార్థుల హజరుపై యాప్ ద్వారా వివరాలు సేకరిస్తామని తెలిపారు. పిల్లలు పాఠశాలకు రాకపోతే మరుసటి రోజే వాలంటీర్ వాళ్ల ఇంటికి వెళ్లి వాకబు చేయాలని సీఎం ఆేదేశించారు.
నాడు నేడు మొదటి విడతలో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మరింత సమర్థవంతంగా రెండో విడత ప్రారంభించాలని ఆధికారులను జగన్ ఆదేశించారు. పనుల నాణ్యతలో ఎక్కడా రాజీ పడవద్దని అన్నారు. రెండవ విడత పనులు ఏప్రిల్ 15వ తేదీ నుండి ప్రారంభిస్తామని, డిసెంబర్ 31వ తేదీలోగా పూర్తి అయ్యేలా ప్రణాళిక వేస్తున్నామని అధికారులు సీఎం జగన్ కు తెలిపారు. రెండవ విడత కోసం అంచనా వ్యయం సుమారు రూ.4,446 కోట్లు ఖర్చుగా అధికారులు తెలిపారు. మొదటి విడత కోసం సుమారు రూ.3,700కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు.
పాఠశాలల అభివృద్ధికి ఒక్క సంవత్సరంలో ఇంత మేర నిధులు వెచ్చించడం చరిత్రలో ఎప్పుడూ జరగలేదని అధికారులు వివరించారు. అదే విధంగా గోరు ముద్ద మధ్యాహ్న భోజన పథకంపైనా సీఎం జగన్ సమీక్ష జరిపారు. పాఠశాలల్లో టాయిలెట్ల నిర్వహణపై కూడా సమీక్ష జరిపారు. టాయిలెట్ల నిర్వహణకు సులభ్ ఇంటర్నేషనల్ తో అవగాహన ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. నిర్వహణ కోసం దాదాపు 49వేల మంది సిబ్బంది అవసరమని, ఎన్ ఓ పి టాయిలెట్ల నిర్వహణ సిబ్బందికి సులభ్ ఇంటర్నేషనల్ శిక్షణ ఇస్తుందని వివరించారు.