Salary : ధనప్రాప్తి కావాలని కోరుకునే వారు పౌర్ణమి రోజు ఈ పరిహారం చేసుకుంటే అద్భుత ప్రయోజనం ఉంటుంది. పౌర్ణమి రోజున, మీకు దగ్గరి లో ఉన్న ఏదైనా గుడి ప్రాంగణంలో ఉన్న రావి చెట్టు దగ్గరకు సరిగ్గా ఉదయం 10.00 గంటలకు రహస్య తంత్ర గ్రంథాలలో చాలా ప్రత్యేకంగా ఈ సమయం గురించి చెప్పబడడం వలన ఉదయం 10.00 గంటల కు ఖచ్చితంగా చేసి తీరాలి. 10 గంటల సమయానికి నీటిలో ఏదీ కలపకుండా స్వచ్చమైన, శుభ్రమైన నీటిని రావి చెట్టుకు పోయాలి. ఇలా పోయడానికి ప్లాస్టిక్ బకెట్లు, బిందెల తో నీటిని పోయకూడదు.ఇనుము,రాగి, ఇత్తడి, లాంటి లోహపు పాత్రల తో నే నీటిని పోయడం మంచిది.
అలా పోసిన తర్వాత మీరు రావి చెట్టుకు ప్రదక్షిణ చేయక్కరలేదు మీరు నీటిని రావి చెట్టుకు పోసినతర్వాత,మంచి ఆదాయాన్ని, ధన ప్రాప్తి ని మీకు ఇమ్మని రావి చెట్టును అభ్యర్థిస్తూ ప్రార్ధించి తిరిగి వచ్చేయాలి. శ్రీ మహా లక్ష్మీ పౌర్ణమి తిథి నాడు పొద్దున్న 10 గంటల సమయంలో రావి చెట్టు నందు కొలువై ఉంటారని రహస్య గ్రందాలలో తెలియచేయబడింది. కాబట్టి మీరు ఆ సమయంలో రావి చెట్టుకు నీటిని పోయడం వలన శ్రీ మహా లక్ష్మి అనుగ్రహంతో మంచి ధన ప్రాప్తి ని పొందుతారు.
ధనం మీ వద్ద స్థిరంగా ఉండాలి అంటే ముందుగా ఒక చిన్న మట్టి కుండ తీసుకొని, దాన్ని రాళ్ల ఉప్పుతో నింపి దాని మీద ఒక పేపరు వేసి జీతం రాగానే మీ జీతమును కానీ పెద్ద మొత్తం లో మీ చేతికి అందిన ధనాన్ని ఉప్పు తో నిండి ఉన్న కుండలో ఒక రాత్రి అంత ఉంచిన తరువాత, తీసేసిన తర్వాత దానిని ఖర్చు ల కోసం వాడటం లేదా దాచుకోవడం కానీ చేయాలి. డబ్బుని ఇలా పెట్టడం వలన డబ్బులకు ఉన్న చెడు శక్తులను, నెగటివ్ ఎనర్జీని ఉప్పు తీసేస్తుంది. డబ్బుకు ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయిన కారణంగా, అనవసర ఖర్చులు తగ్గి ధనం నిల్చి ఉంటూ ఆర్ధిక అభివృద్ధి పొందుతారు.