Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ ప్రారంభమయ్యే సగం గేమ్ అయిపోయింది. ప్రస్తుతం ఎనిమిదవ వారం ఆట కొనసాగుతోంది. అయితే హౌస్ లో సభ్యులకు చూసే ఆడియన్స్ కి మతిపోయే మాదిరిగా ట్విస్ట్ లు మీద ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి. వైల్డ్ కార్డు రూపంలో ఐదుగురు సభ్యులు ఎంట్రీ ఇవ్వగా.. ఆల్రెడీ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ రతిక మళ్లీ హౌస్ లోకి రియంట్రీ అవ్వడం అందరికి షాక్ ఇచ్చినట్లు అయింది. ఇదిలా ఉంటే ఈ సీజన్ స్టార్ట్ అయిన నాటి నుండి ఎక్కువగా పల్లవి ప్రశాంత్ పేరు వినబడటం మనం చూశాం.
ఇదే సమయంలో అతని టార్గెట్ చేసిన సభ్యులు ప్రారంభం నుండి అమర్ దీప్ అదేవిధంగా ఆటో సందీప్. ప్రారంభం నుండి ఈ ఇద్దరు పల్లవి ప్రశాంత్ ఆట తీరుని తక్కువ చేయటంతో పాటు అతన్ని బాడీ షేమింగ్ చేస్తూ.. రచ్చ రచ్చ చేయడం జరిగింది. దీంతో వీరిద్దరూ చాలా నెగటివ్ ప్రారంభంలో ఎదుర్కొన్నారు. మధ్యలో వైల్డ్ కార్డు ఎంట్రీలు ఇచ్చాక ప్రశాంత్ ఆట తీరుపై చాలామంది సైలెంట్ అయిపోయారు. బయట పరిస్థితులు వైల్డ్ కార్డు సభ్యులతో తెలుసుకున్న పరిస్థితి ఉండటంతో ప్రశాంత్ గ్రాఫ్ బయట పెరుగుతున్న క్రమంలో ఎవరు మొన్నటి వరకు టచ్ చేయలేదు. కానీ తాజాగా ఎనిమిదవ వారం నామినేషన్ ప్రక్రియలో.. అమర్ మరోసారి ప్రశాంత్ పై రెచ్చిపోవడం జరిగింది. ఈ క్రమంలో రేయ్ అంటూ ప్రశాంత్ మీద అమర్ మాటలతో విరుచుకుపడ్డాడు.
ఈ క్రమంలో గౌతం మరియు అమర్ ఒకటయ్యి కామెంట్లు చేస్తూ.. చెవిలో గుసగుసలాడుకున్నారు. దీంతో ప్రశాంత్ కి కోపం రావటంతో.. నీకు దమ్ముంటే ఈడకొచ్చి మాట్లాడు.. అలా కొనుక్కోవడం కాదు అని అన్నాడు. దీంతో అమర్ నా ఇష్టం నేను ఎవరితోనైనా మాట్లాడకుండా నీకెందుకు మూసుకొని కూర్చో నువ్వు బిగ్ బాస్ వా అంటూ కౌంటర్ ఇచ్చాడు. ఇదే సమయంలో గౌతం నానా రచ్చ మాట్లాడి దొబ్బెయ్ అని మండి పడటం జరిగింది. గౌతమ్ మరియు అమర్ ఇద్దరు కూడా.. ప్రశాంత్ పై పరుష పదజాలంతో రెచ్చిపోయారు.