BRS MLA: రాజకీయ నాయకులు పరస్పరం ఆరోపణలు, విమర్శలు చేసుకోవడం సహజం. ఓ స్థాయి మించి దూషణలు చేసుకుంటారు. అయితే అధికార బీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధి, సిట్టింగ్ ఎమ్మెల్యే సహనం కోల్పోయి ఏకంగా ఓ టీవీ చర్చా గోష్ఠిలో బీఆర్ఎస్ అభ్యర్ధిపై దాడి చేయడం తీవ్ర సంచలనం అయ్యింది. ఈ ఘటన కుత్భుల్లాపూర్ నియోజకవర్గంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కుత్భుల్లాపూర్ నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై ఓ టీవీ ఛానల్ బుధవారం ఓపెన్ డిబేట్ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్ధులతో పాటు వారి అనుచరులు, ప్రజలు పాల్గొన్నారు.
ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద బీఆర్ఎస్ అభ్యర్ధిగా రంగంలో ఉండగా, బీజేపీ నుండి మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, కాంగ్రెస్ అభ్యర్ధిగా కోలన్ హన్మంత్ రెడ్డి రంగంలో ఉన్నారు. ఆ టీవీ ఛానల్ ఓపెన్ డిబేట్ కు వీరు ముగ్గురు హజరైయ్యారు. అయితే కుత్భుల్లాపూర్ నియోజకవర్గంలో జరిగిన భూకబ్జా విషయంలో బీఆర్ఎస్ అభ్యర్ధి, సిట్టింగ్ ఎమ్మెల్యే వివేకానంద, బీజేపీ అభ్యర్ధి కూన శ్రీశైలంగౌడ్ ల మధ్య మాటా మాటా పెరిగింది. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ప్రభుత్వ భూముల కబ్జాల పర్వం ఎక్కువైందని బీజేపీ అభ్యర్ధి ఆరోపించారు.
ఎమ్మెల్యే వివేకానంద ఆధ్వర్యంలో వందల ఎకరాలు కబ్జాలు అయ్యాయని శ్రీశైలం గౌడ్ విమర్శలు చేశారు. దీంతో ఒక్క సారిగా సహనం కోల్పోయిన ఎమ్మెల్యే వివేకానంద ఒక్క ఉదుటున శ్రీశైలం గౌడ్ మీదకు వెళ్లి గొంతు నులిమి గాయపరిచారు. ఈ హఠాత్మరిణామానికి అందరూ ఒక్క సారిగా ఖంగుతిన్నారు. ప్రోగ్రామ్ నిర్వహకులు, పోలీసులు వారిస్తున్నా వినకుండా ఎమ్మెల్యే వినకుండా బీజేపీ అభ్యర్ధిపై దాడి చేయడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరువర్గాలకు చెందిన వారు ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం ఇచ్చి ఇరువురు అభ్యర్ధుల అనుచరులను చెదరగొట్టారు.
డిబేట్ లో జరిగిన ఈ దాడి ఘటన ఎంత వరకు దారి తీస్తుందోనని ఇరుపార్టీలకు చెందిన సామాన్య కార్యకర్తలు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అధికార పార్టీ ప్రజా ప్రతినిధి వీధి రౌడీగా ప్రవర్తించడం ఏమిటంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ ఘటనపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. పోటీలో ఉన్న ప్రతిపక్ష అభ్యర్ధిపై బహిరంగంగా అధికార పార్టీ అభ్యర్ధి దాడి చేయడం, గొడవకు దిగడం దిగ్భాంతికరమన్నారు. బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తే సామాన్య ప్రజలపై కూడా అదే విధంగా దాడి చేస్తారా అని ప్రశ్నించారు.
Amit Shah – Pawan Kalyan: అమిత్ షాతో పవన్ కళ్యాణ్ భేటీ.. పొత్తులపై స్పష్టత వస్తున్నట్లే..!
The deplorable attack on BJP MLA candidate Kuna Srisailam Goud Garu by BRS goon & sitting MLA KP Vivekananda shows the frustration in BRS that they are losing to the BJP.
What better can be expected from a party of goons.#KCRFailedTelangana pic.twitter.com/4YqZJCDzxJ
— BJP Telangana (@BJP4Telangana) October 25, 2023