Anushka: ప్రముఖ డీవోపి సెంథిల్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన భార్య రూహి కొద్దిసేపటి క్రితమే కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలుస్తుంది. సెంథిల్ కుమార్ మరియు రుహి 2009 సంవత్సరంలో వివాహం చేసుకున్నారు.
ఇక రూహి వృత్తి యోగ శిక్షణలు. ఆమె చాలా కాలం పాటు యోగ క్లాసెస్ ని నిర్వహించింది. ఇక ఈమెకి ఓ టాలీవుడ్ హీరోయిన్ కూడా సుపరిచితమై అట. ఆమె మరెవ్వరో కాదు స్టార్ హీరోయిన్ అనుష్క. అనుష్క కూడా గతంలో యోగా టీచర్ గా పని చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ తరుణంలోనే వీరిద్దరూ మంచి స్నేహితులు అయ్యారట.
అనుష్క తో పని చేసిన ఈమె అనుష్కతో మంచి పరిచయం ఏర్పరచుకుంది. దీంతో వీరిద్దరూ కూడా కొంతకాలం పాటు మంచి స్నేహాన్ని కలిగి ఉన్నారట. ఇక ఈమె భర్త సెంథిల్ కుమార్ గురించి మనందరికీ తెలిసిందే. రాజమౌళి సినిమాలకు సినిమాటో గ్రాఫర్ గా పనిచేసి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. మగధీర నుంచి బాహుబలి వరకు ఆయనే డివోపీగా పనిచేశారు.
ఇక ఈయన వర్క్ కి గాను ఎన్నో అవార్డులు సైతం అందాయి. ఇక రూహి మరియు సెంథిల్ ది ప్రేమ వివాహం. ఇక వీరికి ఇద్దరు కూతుర్లు కూడా ఉన్నారు. ఇక రూహి మరణించడంతో పలువురు సెలబ్రిటీలతో పాటు తన స్నేహితురాలు అనుష్క కూడా తన భర్తకి ధైర్యం చెబుతున్నారు.