Madhuranagarilo: శ్యామ్ సార్ ఫోన్ స్విచాఫ్ వస్తుంది అని రాధ అంటుంది. నా ఫ్రెండ్ ఎప్పుడు అలా చేయడం అమ్మ అంటాడు పండు. చార్జింగ్ అయిపోయి ఉంటుంది లే నాన్న చూసుకొని ఉండరు అని రాధ అంటుంది. మధుర జరిగిన దాని గురించి ఆలోచించి టెన్షన్ పడుతూ ఉంటుంది. నిద్ర రాక లేచి బయటకు వస్తుంది, రాధ వాళ్ళ ఇంట్లో లైటు వేసి ఉంచడం చూసి, పండు కి ఏమైనా ప్రాబ్లం అయి ఉంటుందా అని వస్తుంది. ఏమైంది పండుకున్న ప్రాబ్లమా అని అడుగుతుంది మధుర. పండు కి ఎందుకు సడన్గా కడుపునొప్పి వస్తుంది శ్యామ్ సార్ ని పిలుద్దామనిఅని రాధ అంటుంది.
అన్నిటికీ శ్యామ్ అవసరం లేదని లోపలికి వెళ్లి పండుని చూస్తుంది. ఇది అజీర్ణ నొప్పి అని అంటుంది మధుర. పండు కోసం ఒక కషాయం చేసుకొని వస్తుంది. కషాయం తాగిపించి తగ్గిపోతుంది నాన్న ఏం భయపడకు అని అంటుంది మధుర. ఇంకా పడుకో అని పడుకోబెడుతుంది మధుర పండుని. పండు పడుకున్న తర్వాత మధుర వెళ్ళిపోతుంది. రాధ మధుర కి థాంక్స్ చెప్తుంది. నేను సాయం చేసింది పండుకి నీకు కాదు నువ్వు ఎందుకు థాంక్స్ చెప్తున్నావ్ అని అంటుంది మధుర. సహాయం కాదు నా బాధ్యత అని వెళ్ళిపోతుంది మధుర. కట్ చేసి తెల్లవారుజాము అవుతుంది, రాధ పండు కి పాలు తెచ్చి ఇస్తుంది. మమ్మీ పాలు తాగి వెళ్లి ఆడుకోవచ్చా అని అడుగుతాడు పండు. అప్పుడేనా కొన్ని రోజులు ఆగు నాన్న నొప్పి తగ్గిన తర్వాత ఆడుకుందువు అని అంటుంది రాధ.
ఇంతలో ఫోన్ వస్తుంది రాధకి, ఆదిత్య కోచింగ్ సెంటర్ నుంచి మాట్లాడుతున్నానని ఒక వ్యక్తి ఫోన్ చేస్తాడు, మీరు ఎమ్మెస్ సుందర్ గారి డీటెయిల్స్ అడిగారు కదా, అతని డీటెయిల్స్ దొరికాయి మేడం అని చెప్తాడు. మీరు ఇక్కడికి వచ్చి సంతకం పెట్టాకే మీకు డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్తాడు. నేను వెంటనే బయలుదేరుతాను అని రాధ చెప్తుంది. మనం పండుని స్వప్న దగ్గర వదిలిపెట్టి వెళ్దాం అని శ్యామ్ తో చెప్తుంది రాధ.కట్ చేస్తే శ్యామ్ ఇంకా రాధ ఆఫీస్ దగ్గరికి వస్తారు. శ్యామ్ కి ఫోన్ వస్తుంది, రాధ లోపలికి వెళ్ళి నేను ఫోన్ మాట్లాడేసి వస్తాను అని చెప్తాడు శ్యామ్. రాధ వెళ్లి ఇంతకుముందు మీరు నాకు ఫోన్ చేశారు నాకు డీటెయిల్స్ కావాలి అని అడుగుతుంది. రాధ సైన్ చేయగానే ఆఫీసర్ డీటెయిల్స్ ఇస్తాడు. అడ్రస్ దొరికింది కదా మీ బావ దగ్గరికి వెళ్దాం పద అంటాడు. కట్ చేస్తే, శ్యామ్ రాధ కారులో వెళుతూ ఉంటారు, రాధ మీ బావని చూడగానే మా అక్కను ఎందుకు మోసం చేశావు అని కాలర్ పట్టుకొని అడగకూడదు అతనితో మనకు చాలా పని ఉంది అని అంటాడు శ్యామ్. అలాగే సార్ అని అంటుంది రాధ.
రాధ, శ్యామ్ లొకేషన్ కి వచ్చేస్తారు. అక్కడ ఒక వ్యక్తిని అడిగితే, ఇక్కడ ఇల్లు అమ్మేసి ఏదో ప్లాట్ కడతా అన్నారు అది డిస్ప్యూట్ అవ్వడంతో జరగలేదు అని అంటాడు. మీ బావ కోచింగ్ లో రాంగ్ అడ్రస్ ఇచ్చాడేమో అని అంటాడు శ్యామ్. అలాంటివాడు రాంగ్ అడ్రస్ ఏ ఇస్తాడు అని అంటుంది రాధ. ఈరోజు తో మా బావ దొరికేస్తాడు పండు ఆరోగ్యం కుదుటపడుతుంది అనుకున్నాను అని అంటుంది రాధ. కట్ చేస్తే, స్వప్న పండుకి తినిపిస్తుంది.ఇంతలో రాధ వాళ్ళు వచ్చేస్తారు. ఏంటి రాధ ఏమైంది, శ్యామ్ సార్ ఎక్కడ అని అడుగుతుంది స్వప్న. ఇంటికి వెళ్లారు అని చెప్తుంది రాధ. సరే నేను వెళ్లి కాఫీ తీసుకు వస్తానని స్వప్న వెళుతుంది. స్వప్న కాఫీ,తెచ్చి ఏంటి అంత డల్ గా ఉన్నావ్ ఎమ్మెస్ అడ్రస్ దొరకలేదా అని అడుగుతుంది. దొరికింది కానీ అక్కడికి వెళ్తే అక్కడ ఎవ్వరు లేరు అని చెప్తుంది రాధ.
అయితే వాడు రాంగ్ అడ్రస్ ఇచ్చాడేమో అంటుంది స్వప్న. ఎమ్మెస్ సుందర్ ఒక్కడే కాదా ఇలాంటి తప్పుడు మనుషులు అందరూ అలాగే ఇస్తారు అని అంటుంది రాధ.సంయుక్త ఇంటి వెనకాల నుండి వాళ్ళ మాటలన్నీ వింటుంది. శ్యామ్ అడ్రస్ నీకు దొరకనివ్వను అని అనుకుంటుంది.ఇంతలో శ్యామ్ అక్కడికి వస్తాడు, ఏంటి సార్ ఇలా వచ్చారు అని అడుగుతుంది రాధ. మా బావ గురించి మాట్లాడుకుంటున్నాము దానికి ఎందుకు అంత సీరియస్ గా ఉన్నారు అలాంటి వాడి గురించి తప్పుగా మాట్లాడితే ఏం కాదు ఎందుకలా కోపంగా చూస్తున్నారు అని అంటుంది రాధ. కొంపతీసి తనే రాధ వాళ్ళ బావ అని తెలిసిపోయిందా శ్యామ్ కి అని అనుకుంటుంది సంయుక్త. చెప్పండి సార్ ఎందుకు అలా చూస్తున్నారు అని అడుగుతుంది రాధ.