Manjummel Boys OTT Response: మంజుమ్మల్ బాయ్స్ సినిమా థియేటర్లలో ఏ రేంజ్ రెస్పాన్స్ దక్కించుకుందో మనందరికీ తెలిసిందే. మలయాళం లో రికార్డులను సృష్టించిన ఈ సినిమా తమిళంలోనూ అదరగొట్టింది. ఇక తెలుగులో సైతం థియేటర్లలో అంచనాలను మించి కలెక్షన్స్ రాబట్టింది. ఫిబ్రవరి 22వ తేదీన మలయాళంలో రిలీజ్ అయిన ఈ చిత్రం తెలుగులో ఏప్రిల్ 6న విడుదలైంది. మలయాళం ఇండస్ట్రీలో ఆల్ టైం హిట్గా ఈ మూవీ నిలిచింది. అయితే మలయాళం లో రిలీజ్ అయిన 73 రోజుల అనంతరం ఎట్టకేలకు ఈ చిత్రం ఓటీటీలోకి అడుగు పెట్టింది. ఇక బ్లాక్ బస్టర్ ఈ మూవీకి ఓటిటి రిలీజ్ తర్వాత ప్రేక్షకుల నుంచి ఎటువంటి స్పందన వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటిటిలో మే 5వ తేదీన స్ట్రీమింగ్ కు వచ్చింది.
మలయాళం తో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంది. ఇక ఈ మూవీని hotstar ott లో చూసిన తరువాత చాలామంది ప్రేక్షకులు పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారు. ఎక్స్ ప్లాట్ ఫామ్ లో తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఈ సినిమా అద్భుతంగా ఉందని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. తక్కువ బడ్జెట్ తోనే ఇంత క్లారిటీ చిత్రాన్ని ఎలా తెరకెక్కించారని మేకర్స్ ను అభినందిస్తున్నారు కూడా. ఇక ఈ మూవీ ని అందరూ తప్పకుండా చూడాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా ఈ చిత్రాన్ని థియేటర్లలో చూసి ఉండాల్సిందని కొందరు భావిస్తున్నారు. మొత్తంగా ఈ మూవీకి ఓటీటిలో సైతం అదిరిపోయే రెస్పాన్స్ దక్కుతుంది.
ఈ సినిమాలో చాలా సీన్లు గుజ్బమ్స్ తెప్పించేలా ఉన్నాయని.. ఉత్కంఠతో కత్తి పడేసిందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ మూవీలో ఫ్రెండ్షిప్ ను కూడా గొప్పగా చూపించారని ప్రశంసిస్తున్నారు. ఈ మూవీ లో శ్రీనాథ్ పోషించిన సుభాశ్ క్యారెక్టర్.. చిన్నతనం నుంచి గుహలో ప్రమాదంలో చిక్కుకునే ట్రాన్స్లేషన్ అదిరిపోయిందని సోషల్ మీడియాలో కొందరు పోస్టులు పెడుతున్నారు. ఈ సీన్స్ నువ్వు ప్రత్యేకంగా ప్రశంసిస్తున్నారు. ఇక ఓవరాల్ గా ఈ మూవీ కదా అద్భుతంగా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమా ఓవరాల్ గా రూ.242 కోట్ల కలెక్షన్స్ను దక్కించుకుంది. 200 కోట్ల కలెక్షన్స్ సాధించిన తొలి మలయాళ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది.
20 కోట్ల లోపు బడ్జెట్ తోనే రూపొందిన ఈ సినిమా హీరోయిన్స్ కలెక్షన్స్ రాబట్టడం అంటే విశేషం అని చెప్పుకోవచ్చు. మొత్తం గా 2024లో మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చి ఎవర్ గ్రీన్ రికార్డ్స్ ను క్రియేట్ చేసింది. ఇక ఈ మూవీలో.. షోబీన్ షాహిర్, శ్రీనాథ్, దిలాన్ డెరిన్, బాలు, గణపతి, లాల్ జూనియర్, దీపక్ తదితరులు కీలకపాత్రను పోషించారు. ఇక దర్శకుడు చిదంబరం ఈ మూవీని తెరకెక్కించాడు. సౌహిన్ షాహిర్, బాబు షాహిర్, షాన్ ఆంటోనీ నిర్మించినా ఈ సినిమాకు సుఫిన్ శ్యామ్ మ్యూజిక్ ఇచ్చారు. ఇక ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించిన చిదంబరం తో పాటు మ్యూజిక్ డైరెక్టర్ కి కూడా ప్రశంసలు దక్కాయి. ఇక ఇందులో నటీనటుల పర్ఫామెన్స్ కూడా మెయిన్ హైలెట్గా నిలిచింది.