ప్రజాస్వామ్యంగా ఏర్పడిన ప్రభుత్వాన్ని గత ఏడాది ఆగస్టు నెలలో ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ లు పడగొట్టడం తెలిసిందే. దాదాపు 20 సంవత్సరాలు పాటు ఆఫ్ఘనిస్తాన్ లో స్వేచ్ఛ జీవులుగా బతికిన అక్కడి పౌరులు మళ్లీ.. దేశం తాళిబన్ ల చేతిలోకి వెళ్లిపోవడంతో ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. అంతకుముందు తాలిబాన్ లు పరిపాలించిన సమయంలో దేశంలో కఠినమైన చట్టాలు విధించేవారు. అయితే అవే చట్టాలు ఇప్పుడు కూడా మళ్లీ విధిస్తూ ఉండటంతో ఆఫ్గాన్ ప్రజలు తమ బాధను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే నాటో దళాలు ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని విడిచి వెళ్లే పరిస్థితి ఏర్పడిందో అప్పటినుండి.. కాచుకుని కూర్చున్న తాలిబాన్ లు… ఒక్కసారిగా గత ఏడాది ప్రభుత్వము ఏర్పాటు చేసిన వాళ్లపై దాడులకు పాల్పడి దేశం మొత్తాన్ని స్వాధీన పరుచుకున్నారు.
జస్ట్ ఇంటర్ పాస్ అయితే చాలు.. బంగారం లాంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. వెంటనే అప్లయ్ చేయండి
అయితే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో ఏర్పడిన తాలిబాన్ ప్రభుత్వం.. గతంలో మాదిరిగానే మహిళలపై విపక్షత చూపించే రీతులో వ్యవహరిస్తూ ఉంది. గత కొద్ది నెలల క్రితం కేవలం హై స్కూల్ వరకు మాత్రమే ఆడపిల్లలు చదవాలని ఉన్నత విద్యలు అనవసరమని.. తాలిబాన్ ప్రభుత్వం ప్రకటన చేయడం తెలిసిందే. ఇదిలా ఉంటే ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ కార్యాలయాలలో పనిచేసే మహిళలకు ఊహించని షాక్ లు ఇస్తున్నారు. విషయంలోకి వెళ్తే ప్రభుత్వ కార్యాలయాల్లో ఆఫ్ఘనిస్తాన్ లో మహిళలు రావాల్సిన అవసరం లేదని ఖాళీగా ప్రభుత్వం కొత్త ప్రకటన చేయడం జరిగింది.
వాళ్ల స్థానంలో సమీప బంధువు లేదా కుటుంబ సభ్యుడు పురుషుడు ఆఫీసులకు పంపాలని.. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసిన పంపించేసిన మహిళలకు తెలియజేయడం జరిగింది. ఈ క్రమంలో ఆర్థిక శాఖలో ఓ మహిళ ఏంటి ఇటువంటి రూలు అనే ప్రశ్నిస్తే.. 60 వేల రూపాయల జీతాన్ని 12 వేలకు చేశారు. ఇదే సమయంలో మరింతగా ప్రశ్నిస్తే ఆమెను ఉద్యోగం నుండి తాలిబాన్ ప్రభుత్వం తీసేయడం జరిగింది. ఆఫ్గానిస్తాన్ లో మహిళలు తమ హక్కులను తాలిబాన్ లు కాలరాస్తున్నారు అంటూ లబోదిపోమంటున్నరు.