తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నుంచి తెలంగాణను, ఆ రాష్ట్ర ప్రజలనూ దేవుడే కాపాడాడని కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం అన్నారు. తెలంగాణ ఎన్నికలలో ఘన విజయం సాధించినందుకు తెరాస అధినేత కేసీఆర్ ను ఆయన అభినందించారు. ఈ రోజు తన స్వగృహంలో విలేకరులతో మాట్లాడిన ముద్రగడ చంద్రబాబు వంటి మోసకారిని రాష్ట్రంలోకి రానివ్వకుండా తెలంగాణ ప్రజలు విజ్ణత ప్రదర్శించారన్నారు.
ఏపీ ప్రజలను కూడా చంద్రబాబు నుంచి కాపాడాలని భగవంతుడిని వేడుకుంటున్నానన్నారు. రిజర్వేషన్ల విషయంలో కేసీఆర్ విజ్ణతను ఆయన ఈ సందర్భంగా ప్రశంసలలో ముంచెత్తారు. కాపు రిజర్వేషన్ల విషయంలో చంద్రబాబు మోసపూరిత విధానాలను అవలంబిస్తున్నారని విమర్శించారు. కోర్టు తీర్పులు…అభ్యంతరాలు అంటూ ఆయన చెబుతున్న కారణాలు సాకులు మాత్రమేనని ముద్రగడ అన్నారు.