వైజాగ్ గ్యాస్ లీక్ ఉదంతం రాష్ట్రం మొత్తాన్ని కలవరపెట్టిన విషయం తెల్సిందే. తాజాగా ఈ సంఘటన విషయమై పోలీసులు 12 మంది ఎల్జి పాలిమర్స్ ఉన్నతాధికారులను నేడు అరెస్ట్ చేసారు. నిన్ననే హైపవర్ కమిటీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిసి నివేదిక సమర్పించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక సీఎస్ నీరబ్ కె ప్రసాద్, 4,000 పేజీల రిపోర్ట్ లో ఎల్జీ పాలిమర్స్ ఉన్నతాధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ దారుణమైన సంఘటన జరిగిందన్న నివేదికను అందచేశారు. ఈ నివేదిక ఆధారంగా సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు బాధ్యులైన 12 మందిని అరెస్ట్ చేసారు. ఈ అరెస్టైన వారిలో సంస్థ డైరెక్టర్లు, ఇంజినీర్లు, సీఈఓ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అరెస్టుల గురించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.