టాలీవుడ్ లో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ స్థాయి నుండి స్టార్ ప్రొడ్యూసర్ స్థాయి వరకు ఎదిగి ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లి అక్కడ ఓటమి చవి చూసి తర్వాత మళ్ళీ కమీడియన్ గా రీ ఎంట్రీ ఇచ్చిన బండ్ల గణేష్ తాజాగా కరోనా వైరస్ సోకగా కొద్ది రోజుల్లోనే కోలుకున్నారు. అయితే గణేష్ తన కంబ్యాక్ ఫిలిం అయిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో ఆ పాత్రలో నటించడం తనకు ఏమాత్రం నచ్చలేదు అని ఇప్పుడు చెప్పుకొచ్చారు.
సినిమా చూసిన తర్వాత అతని స్నేహితులు మరియు ఆత్మీయులు అతని పాత్రకు నెగిటివ్ ఫీడ్ బ్యాక్ ఇచ్చారని మరియు ఆ చిత్రం చేసినందుకు తాను ఎంతో బాధ పడుతున్నారని బండ్లగణేష్ చెప్పారు. అంతే కాకుండా ఇంకోసారి అలాంటి పాత్రలో చేయడం కన్నా పూర్తిగా సినిమాని మానేస్తానని హామీ ఇచ్చారు. ఇక ఆ పాత్ర చేసినందుకు తనని మందలించిన శ్రేయోభిలాషులు అందరికీ ఇక భవిష్యత్తులో ఇటువంటి పాత్రలు చేయనని… ఇంకా దాదాపు తన నటనను ఆపేసినట్లే అని గణేష్ చెప్పుకోవడం గమనార్హం.
ఇదిలా ఉండగా తనకి కరోనా సోకినప్పుడు చిరంజీవి ఫోన్ చేసి ధైర్యం చెప్పారని చెప్పిన గణేష్ తనకు పాజిటివ్ అని రిపోర్టు వచ్చినప్పుడు చాలా భయపడ్డానని.. ప్రాణాలు పోతాఏమో అని అనుకున్నాను అని… అయితే దేవుడి దయ వల్ల తిరిగి మామూలుగా కాగలిగాను అని చెప్పారు. ఇదిలా ఉండగా 2019 ముందు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చేరిన గణేష్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వాన్ని తెగ పొగిడేశారు. 108, 104 అంబులెన్సులు ఆంధ్రప్రదేశ్ లో చూడటం తనకెంతో సంతోషంగా ఉందని మరియు జగన్ నిర్ణయాన్ని తాను మనసారా స్వాగతిస్తున్నారు అని చెప్పారు
Siri Hanumanthu: సిరి కి ఆఫర్లు కోసం అటువంటి పనులు చేసేది.. బుల్లితెర నటుడు నూకరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!