ఏది ఏమైనా ఏపీలో తెలుగుదేశం పార్టీ బిజెపితో పొత్తు తర్వాత జనసేన ఆటలో అరటిపండు మాదిరిగా మారిపోయింది. ముందుగా జనసేనకు 24 అసెంబ్లీ.. మూడు పార్లమెంటు స్థానాలు ఇచ్చారు. జనసేనకు ఇది అసలు ఏ మాత్రం రుచించలేదు. ముద్రగడ పద్మనాభం, హరిరామ జోగియ్య లాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ కనీసం 60 నుంచి 70 సీట్లు తీసుకుని పోటీ చేయాలని అనుకున్నారు. ఈ కోణంలోనే పవన్కు లేఖలు రాశారు. అయితే పవన్ 24 సీట్లకే ఓకే చెప్పడంతో కాపు నేతలతో పాటు జనసేన వీరాభిమానులు సైతం అస్సలు తట్టుకోలేకపోయారు.
అయితే జనసేన 24 సీట్లు తీసుకోవడం వెనక పవన్ గాయత్రీ మంత్రంలోని 24 అక్షరాలను స్ఫూర్తిగా తీసుకున్నామని చెబుతూ సమర్ధించుకునే ప్రయత్నం చేశారు. గాయత్రి మంత్రం ఎంత పవర్ ఫుల్లో తమ పొత్తు కూడా అంతే పవర్ ఫుల్ అని పవన్ చెప్పి నిరాశతో ఉన్న జనసైనికులను కూల్ చేసే ప్రయత్నం చేశారు. దీనిపై కూడా చాలా సెటైర్లు పేలాయి. పవన్ కళ్యాణ్ కనీసం 7 నుంచి 8 పార్లమెంటు స్థానాలు తీసుకుని పోటీ చేస్తారని అందరూ అనుకున్నారు. అయితే చంద్రబాబు కేవలం అనకాపల్లి, మచిలీపట్నం, కాకినాడ పార్లమెంటు స్థానాల మాత్రమే జనసేనకు పొత్తులో భాగంగా కేటాయించారు.
అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది.. కూటమిలోకి బిజెపి వచ్చి చేరింది.. పవన్ తనకు ఇచ్చిన మూడు పార్లమెంటు స్థానాలలో అనకాపల్లి వదులుకుని కేవలం కాకినాడ, మచిలీపట్నం స్థానాలలో మాత్రమే పోటీ చేస్తున్నారు. అక్కడితో ఆగలేదు. తనకు ఇచ్చిన 24 సీట్లలో మరో మూడు సీట్లు బీజేపీకి త్యాగం చేశారు. అంటే పవన్ 24 సీట్లు తీసుకుని చాలా తక్కువంటే గాయత్రి మంత్రం చెప్పి నిరాశ, నిస్పృహలతో ఉన్న తన అభిమానులు, జనసేన కేడర్కు గాయత్రి మంత్రం వేశారు.
మరి ఇప్పుడు మరో మూడు సీట్లు తగ్గించుకోవడంతో పాటు అటు ఒక పార్లమెంటు సీటు కూడా వదులకున్నారు. అంటే బీజేపీ వచ్చి చేరడంతో పవన్ 4 సీట్లు లాస్ అయ్యారు. మరి పవన్ ఇప్పుడు ఏ మంత్రం చెపుతారో ? అంటూ మళ్లీ సెటైర్లు పేలుతున్నాయి.. ఇటు వైసీపీ నుంచి భారీ ఎత్తున ట్రోల్స్ నడుస్తున్నాయి.