న్యూఢిల్లీ:కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ట్విట్టర్లో ఫాలో అవుతున్న వారి సంఖ్య కోటికి చేరుకుంది. దీనిపై నేడు రాహుల్ గాంధీ స్పందిస్తూ ‘ట్విట్టర్లో నా ఫాలోయర్ల సంఖ్య పది మిలియన్లకు చేరుకున్నది. వీరిలో ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు, ఈ మైలురాయి అందుకున్న నేపథ్యంలో అమేఠీలో కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి సంబరాలు జరుపుకుంటా. ఈ రోజు అమేఠీలో కాంగ్రెస్ కార్యకర్తలు, మద్దతుదారులతో భేటీ కాబోతున్నా’ అని ట్వీట్ చేశారు.
10 Million Twitter followers – thank you to each and every one of you! ??
I will celebrate the milestone in Amethi, where I will be meeting our Congress workers & supporters today.
— Rahul Gandhi (@RahulGandhi) July 10, 2019