అలా ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాజధాని వికేంద్రీకరణ బిల్లు కు మరియు సీఆర్డీఏ రద్దు బిల్లుకు ఆమోదం తెలిపిన వెంటనే తర్వాత కార్యాచరణపై వైసిపి శ్రేణులు సన్నాహాలు మొదలు పెట్టేశాయి. ఇక జగన్ అయితే మామూలు ఊపులో లేడు.
తాజాగా వస్తున్న రిపోర్టర్లు ప్రకారం జగన్ పూర్తిగా అమరావతి క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అనగా (సిఆర్డిఏ) ను కాన్సిల్ చేశారని తెలుస్తోంది. మొత్తం సీఆర్డేయే పరిధిలో ఉండే అన్ని అంశాలను చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన, చేసుకున్న డీల్స్ మరియు ఇచ్చిన హామీలను జగన్ రూపు మార్చేశాడు. ఆ ప్లేస్ లో న్యూ అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఏఎమార్డీఏ) ని జగన్ ప్రవేశపెట్టనున్నాడు.
ఇక రాత్రికి రాత్రే ఇందుకు సంబంధించిన నాలుగు జీవోలు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసినట్లు సమాచారం. వాటిలో సీఆర్డీఏ రద్దు మరియు దాని స్థానంలో ఏఎన్ఆర్డిఏ ను ప్రవేశపెట్టడం కూడా జరిగిపోయాయట. ఇదే కనుక జరిగితే అభివృద్ధి అయ్యే స్థలాల పరిధిలోని భూముల రేట్లు పెరిగేందుకు మరింత ఎక్కువ సమయం పడుతుంది. అంతే కాకుండా ఇప్పటి వరకు పెద్ద పెద్ద ఇన్వెస్టర్లకు మరియు రాజధాని నిర్మాణానికి తమ భూములను త్యాగం చేసిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది.
మొత్తం అడ్మినిస్ట్రేటివ్ విశాఖకు మార్చిన తర్వాత ఇక్కడ పేరుకి మెట్రోపాలిటన్ అని పెట్టినా కూడా జగన్ కొత్త చట్టం ద్వారా ఇది అంత పెద్ద ప్రాముఖ్యతని సంతరించుకోవడం అన్న విషయం స్పష్టంగా కనపడుతోంది. ఎంతైనా రానున్న రోజుల్లో అమరావతి ప్రజలు ఇలాంటి షాకుల మీద షాకులు మరెన్నో తినేందుకు రెడీగా ఉండాలి.