ఆగస్టు 5వ తేదీన అయోధ్యలో రామమందిర నిర్మాణ భూమి పూజ జరగనున్న సందర్భంగా ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ కార్యక్రమానికి ప్రధాని మోదీ సహా మొత్తం 150 మంది వరకు అతిథులు హాజరు కానున్నారు. అయితే ఆలయ నిర్మాణంలో ఉపయోగించేందుకు గాను మొత్తం 150 నదుల నుంచి ఇద్దరు సోదరులు నీటిని సేకరించారు. ఆ సోదరులు ప్రస్తుతం అయోధ్యకు చేరుకున్నారు.
రాధే శ్యాం పాండే, శబ్ద్ వైజ్ఞానిక్ మహాకవి త్రిఫల అనే ఇద్దరు సోదరులు 1968 నుంచి 2019 వరకు అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం అవసరమవుతాయని చెప్పి అనేక మార్గాల్లో ప్రయాణాలు చేశారు. కాలినడకన వెళ్లారు. సైకిల్ తొక్కి పలు ప్రదేశాలు చేరుకున్నారు. కొన్ని ప్రదేశాలకు మోటార్సైకిళ్లు, ట్రెయిన్లు, విమానాల ద్వారా కూడా వెళ్లారు. శ్రీలంకలోనూ పర్యటించారు. ఈ క్రమంలో రాముడు తిరిగిన పలు చోట్లకు చెందిన మట్టితోపాటు మొత్తం 151 నదులు, 8 పెద్ద నదులు, 3 మహా సముద్రాలు, 16 చోట్ల నుంచి మట్టిని సేకరించి అయోధ్యకు తెచ్చారు. వీరిద్దరూ ప్రస్తుతం అయోధ్యకు చేరుకున్నారు.
ఆ సోదరులిద్దరూ సేకరించిన నీరు, మట్టిని అయోధ్య రామ మందిర నిర్మాణంలో ఉపయోగించనున్నారు. కాగా ఇప్పటికే రామ మందిర నిర్మాణ భూమి పూజకు సంబంధించి దాదాపుగా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కోవిడ్ జాగ్రత్తల నడుమ సోషల్ డిస్టన్స్ పాటిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అదే రోజు మోదీ అయోధ్యలో రూ.500 కోట్ల విలువ చేసే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు కూడా చేస్తారు.
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!