తెలుగుదేశం పార్టీకి అయ్యన్నపాత్రుడు అత్యంత ముఖ్యమైన లీడర్. మొత్తం ఎల్లో పార్టీ తరపున ఫైర్ బ్రాండ్ గా వ్యవహరించే అయ్యన్న చంద్రబాబు కంటే కూడా పార్టీలో సీనియర్ నేత. అటువంటి అయ్యన్నపాత్రుడు ఇప్పుడు హఠాత్తుగా ఎవరికీ అర్థం కాని రీతిలో మోడీ భజన చేస్తున్నాడు.
విషయం ఏమిటంటే అయోధ్యలో రామాలయం ని మోడీ ప్రధానిగా ఉండబట్టే నిర్మించగలుగుతున్నామని అయ్యన్నపాత్రుడు కితాబు ఇచ్చారు. అయోధ్య రామాలయం హిందువుల కల నై, వాజ్ పేయి, అద్వానీ వంటివారు అది చేయాలనుకున్నా కుదరలేదని.. కేవలం మోదీ తోనే సాధ్యపడింది అని చెప్పుకొచ్చారు. రామాలయ నిర్మాణం కోసం ప్రతి హిందువు కనీసం పది రూపాయలు అయినా ఇచ్చి ప్రధాని నరేంద్ర మోడీకి సహకరించాలని అయ్యన్న ఈ సందర్భంగా కోరడం విశేషం. అలా అయోధ్య రామాలయం నిర్మాణంలో అంతా భాగస్వామ్యం కావాలని పిలుపుని కూడా ఇచ్చారు.
అసలు ఇప్పటి వరకూ ఈ తరహా ఏపీ రాష్ట్రంలో నిఖార్సైన బీజేపీ నేతలు కూడా ఇంతవరకు ఇలాంతి మద్దతుని ఇవ్వలేదు. మరి అయన్న ఇలా అపర హిందూత్వ గా అవతరించి కీర్తించడం వెనుక కారణం ఏంటని రాజకీయాల్లో చర్చగా మారింది. నిదానంగా చంద్రబాబు మూడు రాజధానులు విషయంలో పెద్ద షాక్ తగిలిన తర్వాత మోడీని ప్రసన్నం చేసుకునేందుకు ఇలా ఓ రాయి వేశారా అన్న అనుమానాలు కూడా మొదలయ్యాయి.
గతంలో ఇదే అయ్యన్న మసీదులను కూల్చేసిన పార్టీ… దేశంలో హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెట్టిన పార్టీ ఇది అంటూ బిజెపి పై తీవ్ర విమర్శలు చేసిన రోజులు కూడా ఉన్నాయి. అలాంటి అయ్యన్న ఇప్పుడు ఇలా మోడీని పొగిడాడని తెలిస్తే ప్రధాని కూడా నమ్మలేని పరిస్థితి. మరి బీజేపీ వైపు మళ్ళిన గాలి అయ్యన్న సొంత కారణాల వల్లనా లేకపోతే ఇదంతా టిడిపి వారి వ్యూహంలో భాగమా… అని అర్థం కాక జనాలు జుట్టు పీక్కుంటున్నారు.