ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం క్రమంగా టిడిపి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అచ్చెన్నాయుడు అరెస్ట్ తర్వాత ప్రక్క రోజే తెల్లవారుజామునే జెసి ప్రభాకర్ రెడ్డి మరియు అతని తనయుడు అశ్మిత్ రెడ్డి ల అరెస్ట్ జరిగిన విషయం తెలిసిందే. అచ్చెన్నాయుడు తో పోలిస్తే జెసి కుటుంబంపై ఉన్న కేసు చాలా పెద్దది మరియు స్పష్టమైంది కూడా.
ఇకపోతే ఇదే కేసులో జేసీ ప్రభాకర్ రెడ్డిని విచారిస్తున్న అధికారులు త్వరలోనే అతని సోదరుడు మరియు తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి అయిన జెసి దివాకర్ రెడ్డి ను అరెస్టు చేసే పరిస్థితులు కూడా కనిపిస్తున్నట్లు చెబుతున్నారు.
Bs3 వాహనాలను 2013లో సుప్రీంకోర్టు రద్దు చేసిన తర్వాత జెసి అశోక్ లేలాండ్ నుండి ఆ రకమైన వాహనాలను స్క్రాప్ కింద కొన్ని వాటిని బస్సులు గా తయారు చేసి నాగాలాండ్ లో నకిలీ లైసెన్స్ లను తయారుచేయించి నడుపుతున్న సంగతి బయటపడింది. అశోక్ లేలాండ్ వారు తాము వాటిని స్క్రాప్ కిందే అమ్మామని కచ్చితమైన నివేదిక బయటపెట్టిన తరువాత మొదలైంది అసలైన కథ.
పోలీసులు మరియు రవాణా శాఖ అధికారులు దాదాపు అరవై బస్సులను సీజ్ చేయగా మిగిలిన వాటిని జేసీ కుటుంబం ఎక్కడో దాచి ఉంచారు అన్న ఆరోపణలు ఉన్నాయి. అలాగే వారు నడిపే చాలా బస్సులు నకిలీ ఇన్సూరెన్స్ తయారుచేయించి నడుపుతున్నారని…. ఆ బస్సులో ఏదైనా ప్రమాదం జరిగితే చనిపోయిన వారికి ఒక్క రూపాయి కూడా ఇన్సూరెన్స్ రాదని విచారణలో బయటపడింది.
ఇక ముందస్తుగా జేసీ ప్రభాకర్ రెడ్డిని ఈ కేసులో అరెస్టు చేసిన అధికారులు త్వరలోనే జేసీ దివాకర్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అలాగే తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి కూడా జెసి దివాకర్ రెడ్డి అక్రమ బిజినెస్ లో భాగంగా లారీలను బస్సులుగా తయారుచేసే ప్రాణాలతో ఇన్ని రోజులు చెగాట్ం ఆడాడని…. అతని వల్ల చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్నారని ఆరోపించి అతనిని అరెస్టు చేయాలని డిమాండ్ చేసాడు. అదీ కాకుండా అక్రమమైన పనులు చేసి ఇప్పుడు కుట్రపూరితంగా తమ పార్టీ వారిని అరెస్టు చేస్తున్నారని ముసలి కన్నీరు కారుస్తున్నారని ఆయన అన్నారు.