అమరావతి: ప్రజల కనీస అవసరాల కోసం ఎవరిచుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా వాలంటీర్ల వ్యవస్థను ప్రారంభించామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పేర్కొన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న సిఎం వైఎస్ జగన్ శుక్రవారం సాయంత్రం ట్విట్టర్ వేదికగా సందేశం ఇచ్చారు. గ్రామ స్వరాజ్యం దిశగా అడుగువేశామని ఆయన పేర్కొన్నారు. ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ బాధ్యత వహిస్తారని జగన్ పేర్కొన్నారు. సంక్షేమ పథకాలను డోర్ డెలివరీ చేస్తారని అయన అన్నారు. గ్రామ సచివాలయంతో వాలంటీర్ల వ్యవస్థను అనుసంధానం చేసుకొని ప్రజల సమస్యలన్ని పరిష్కరిస్తారని జగన్ పేర్కొన్నారు.
నిన్న సాయంత్రం జగన్ అమెరికా పర్యటనకు వెళ్లారు. ఈ నెల 22వ తేదీ వరకూ అక్కడ పర్యటనలో ఉంటారు. 23న తిరిగి రాష్ట్రానికి రానున్నారు.
గ్రామ స్వరాజ్యం దిశగా అడుగువేశాం. వాలంటీర్ల వ్యవస్థను ప్రారంభించాం. కనీస అవసరాలకోసం ప్రజలు ఎవరిచుట్టూ తిరగాల్సిన అవసరంలేదు. ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ బాధ్యత వహిస్తారు. సంక్షేమ పథకాలను డోర్డెలివరీ చేస్తారు. గ్రామ సచివాలయంతో అనుసంధానం చేసుకుని మీ సమస్యల్ని పరిష్కరిస్తారు.
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 16, 2019