కరోనా కమ్మేస్తున్న ప్రస్తుత సమయంలో వ్యవస్థలు మొత్తం మనుగడ కోసం ప్రత్యామ్యాయ ఆలోచనలు చేస్తున్నాయి. ఇందులో ఆటోమొబైల్ రంగం కూడా ఉంది. కరోనా టైమ్ లో కార్లు, బైకుల సేల్స్ పెంచే నిర్ణయం వెలువడింది. ఆగస్ట్ 1 నుంచి కార్లు, బైకుల ధరలు తగ్గనున్నాయి. ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) తీసుకున్న నిర్ణయమే ధరల తగ్గుదలకు కారణం. ఇకపై బైక్ లేదా కార్ కొనేటప్పుడు లాంగ్ టర్మ్ వెహికిల్ ఇన్స్యూరెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదని.. ఇది తప్పనిసరి కాదని కూడా స్పష్టం చేసింది. దీంతో కార్లు, బైకులకు ఆన్ రోడ్ ప్రైస్ తగ్గనుంది. ఆగస్ట్ 1 నుంచి ఈ నిర్ణయం అమలులోకి రానుంది.
ప్రస్తుత నిబంధనల ప్రకారం ఫోర్ వీలర్లకు మూడేళ్లు, టూవీలర్లకు ఐదేళ్లు లాంగ్ టర్మ్ కాంప్రహెన్సీవ్ పాలసీ తీసుకోవాలి. దీని వల్ల వాహనదారులు అన్ని సంవత్సరాల ప్రీమియం ముందుగానే చెల్లించేవారు. దీంతో వాహనాల ఆన్ రోడ్ ప్రైస్ భారీగా పెరుగుతోంది. కరోనా సమయంలో కస్టమర్లకు వెసులుబాటు కల్పించేందుకు ఐఆర్డీఏఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఆగస్ట్ 1 నుంచి టూవీలర్ లేదా ఫోర్ వీలర్ కొనే వాహనదారులు ఒక సంవత్సరానికే వెహికిల్ ఇన్స్యూరెన్స్ తీసుకోవచ్చు. ఆ తర్వాత ప్రతీ ఏడాది రెన్యువల్ చేయించాల్సి ఉంటుంది.
థర్డ్ పార్టీ ఇన్స్యూరెన్స్ కారుకు మూడేళ్లు, బైకుకు ఐదేళ్లు తీసుకోవాలి. దీనివల్ల వెహికల్ ఆన్ రోడ్ ప్రైస్ తక్కువ ధరకే లభిస్తుంది. ఇకపై లాంగ్ టర్మ్ ఇన్స్యూరెన్స్ కస్టమర్స్ కావాలనుకున్నా తీసుకోలేరు. ఇది వినియోగదారులకు శుభవార్త అనే చెప్పాలి.