న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంలేదు. పాజిటివ్ కేసుల సంఖ్య, మరణాలు క్రమక్రమంగా పెరుగుతూనే ఉన్నాయి.వైరస్ ఉద్దృత్తి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 3,967 కేసులు నమోదు కాగా, 100 మంది మృతి చెందారు. వీటితో ఇప్పటి వరకు 81,970 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా బులిటెన్లో పేర్కొన్నది. ఇందులో 51,401 యాక్టివ్ కేసులు ఉన్నాయని.. 27,919 మంది కోలుకున్నారని వెల్లడించింది. కరోనా మృతుల సంఖ్య 2,649కి చేరినట్లు తెలిపింది. ఇక మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, రాజస్తాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో కరోనా వైరస్ ఉదృతి తీవ్ర ఆందోళన కల్గిస్తోంది.
తాజా సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో 2205, తెలంగాణలో 1414, కర్ణాటకలో 987, తమిళనాడులో 9674, కేరళలో 560, ఒరిస్సాలో 611, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ 33, అరుణాచల్ ప్రదేశ్ లో ఒకటి, అస్సాం 87, బీహార్ 994, ఛండీగర్ 191, ఛత్తీస్ఘడ్-60, దాదర్ నగర్ హవేలీ ఒకటి, ఢిల్లీ 8470, గోవా 14, గుజరాత్ 9591, హర్యానా 818, హిమాచల్ప్రదేశ్ 74, జమ్ముకశ్మీర్ 983, జార్ఖండ్ 197, లడాక్ 43, మధ్యప్రదేశ్ 4426, మహారాష్ట్ర 27524, మణిపూర్-3, మిజోరం ఒకటి, మేఘాలయా 13, పుదుచ్చేరి 13, పంజాబ్ 1935, రాజస్థాన్ 4534, త్రిపుర 156, ఉత్తరాఖండ్ 78, యూపీ 3902, పశ్చిమ బెంగాల్ లో 2377 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కాగా కరోనా మరణాలు అత్యధికంగా మహారాష్ట్రలో 1019 సంభవించగా.. ఆ తర్వాత గుజరాత్లో 586, మధ్యప్రదేశ్ లో 237, పశ్చిమ వబెంగాల్ లో 215, రాజస్తాన్ లో 125 మంది మృతి చెందారు.