Corona virus : భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ మొదలైంది అన్న ప్రకంపనలు ఎక్కువైపోయాయి. అందుకు తగ్గట్టే మహానగరాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా మళ్లీ పంజా విసురుతోంది. ఇక గత కొద్ది రోజులుగా అక్కడ కేసులు పెరుగుతుండడంతో నైట్ కర్ఫ్యూ కూడా విధించారు.
కొన్ని జిల్లాల్లో అయితే ఏకంగా లాక్డౌన్ విధించారు. స్కూళ్ళు, కాలేజీలు, మార్కెట్లను మూసేశారు. ఇక అన్నిటికన్నా విస్తుగొలిపే విషయం ఏమిటంటే… తాజాగా వాషిమ్ జిల్లాలోని రిసొడ్ తాలూకా లోని డేగాన్ కు చెందిన ఒక పాఠశాల హాస్టల్ లో 327 మంది విద్యార్థులు ఉంటున్నారు. అయితే వారిలో ఏకంగా 229 మంది కి కోవిడ్ సోకడం గమనార్హం. అలాగే విద్యార్థులతో పాటు ఆ హాస్టల్ లో పనిచేస్తున్న మరో నలుగురు ఉద్యోగులకు కూడా వైరస్ సోకింది.
ఇక బారినపడిన వారిలో ఎక్కువ మంది 13 నుండి 15 సంవత్సరాల మధ్య వయసుగల కావడం గమనార్హం. ఆ విద్యార్థులకు వేరుగా ఉంచి చికిత్స అందిస్తున్నారు. దీంతో పాఠశాలను కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు. ముంబై మహానగరంలో కూడా భారీ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. వాటిలో కొన్ని ఈ మధ్య బయటపడ్డ కొత్తరకం స్ట్రైన్ కి చెందిన కేసులు కావడం గమనార్హం.
అన్ని ప్రాంతాల్లో గత కొద్ది రోజుల నుండి అధిక సంఖ్యలో కేసులు నమోదు అవుతుంటే సెకండ్ వేవ్ భారతదేశంలో ప్రారంభమైందని అందరూ భయపడుతున్నా. గడచిన 24 గంటల్లో ఒక మహారాష్ట్రలోని ఎనిమిది వేల కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం, ముంబై పోలీసులు కోవిడ్ ఆంక్షలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఒకవైపు దేశవ్యాప్తంగా స్కూళ్ళన్నీ తెరుచుకున్నాయి. ఇలాంటి సమయంలో ఈ కోవిడ్ మహమ్మారి మళ్ళీ విద్యార్థులకు భయాందోళనకు గురిచేస్తోంది. తల్లిదండ్రులు కూడా విపరీతంగా కంగారుపడుతున్నారు. మహానగరాల్లో పిల్లలను స్కూలుకు పంపించాలంటే వారికి వణుకు వస్తుంది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడమే లక్ష్యంగా కఠినచర్యలను అమలు చేసే విషయంలో ఏమాత్రం అలసత్వం పనికిరాదని రాష్ట్రాలకు కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రభుత్వం తీవ్రమైన హెచ్చరికలు జారీ చేసింది.