ఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘానికి కోర్టు ధిక్కరణ కింద సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.
అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థుల నేర చరిత్రను పత్రికలు, టివిల్లో ప్రచురించేలా చేయాలని గతేడాది ఇచ్చిన తీర్పును ఎన్నికల సంఘం అమలు చేయకపోవడాన్ని ఆక్షేపించింది.
ఇప్పటివరకూ అభ్యర్థులెవరూ కేసుల వివరాలు ప్రకటించలేదని సుప్రీం కోర్టు పేర్కొంది. వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.
పార్టీలు, అభ్యర్థుల కేసుల వివరాలను పత్రికలు, టివిలు, వెబ్సైట్లలో పొందుపరచాలని 2018 లో ఎన్నికల సంఘానికి సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
కానీ ఎన్నికల సంఘం అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోలేదు. దీంతో తమ ఆదేశాలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలంటూ సుప్రీం కోర్టు ఎన్నికల సంఘాన్ని కోరింది. అయితే ఎన్నికల సంఘం ఈ విషయమై సానుకూలంగా స్పందించకపోవడంతో సుప్రీం కోర్టు ధిక్కరణ నోటీసులు జారీచేసింది.