జనసేన పార్టీలో అంతర్గత కుమ్ములాటలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా టికెట్ల వ్యవహారం.. ఈ పార్టీలోనూ ఇబ్బందులు పెడుతోంది. తమకంటే తమకే కావాలనే నాయకులు పెరుగుతున్నారు. పైకి ఎవరూ మాట్లాడకపోయినా.. అంతర్గతంగా పార్టీకి వస్తున్న అభ్యర్థనలు, ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఫిర్యాదులను గమనిస్తే.. జనసేనలోనూ ఇబ్బందులు తప్పేలా లేవని అంటున్నారు పరిశీలకులు. ఉదాహరణకు రాజోలు టికెట్ను ముగ్గురు ఆశిస్తున్నారు. వీరిలో ఒకరిని మాత్రమే ఎంపిక చేయాల్సి ఉంది.
అది కూడా పెదపాటి అమ్మాజీకి ఇస్తామని.. గతంలోనే పవన్ హామీ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. కా నీ, ఆయన కన్నా తామే ఎక్కువని మరో ఇద్దరు నాయకులు అర్జీలు పెట్టుకున్నారు. దీంతో కలివిడిపోయి .. కయ్యాలకు దారితీస్తున్నారు. విజయవాడ సెంట్రల్లో టీడీపీ నేతలను తమను పట్టించుకోవడం లేదని.. జనసేన నాయకుడు శోడిశెట్టి రాధా వర్గం.. మంగళగిరిలో పెద్ద నిరసన వ్యక్తం చేసింది. తాము సహకరించేది లేదని తేల్చి చెప్పింది. ఇది పెద్ద తలనొప్పిగా మారింది.
అలాగే, అనంతపురం అర్బన్ టికెట్ను జనసేన ఆశిస్తున్నా.. ఇక్కడి నాయకుల మధ్య సఖ్యత లోపిం చింది. పైగా టికెట్ వదులుకుంటున్న వైకుంఠ ప్రభాకర చౌదరి.. జనసేన అధినేత పవన్ అంటే ఇష్టమ ని చెబుతున్నా.. స్థానిక నాయకులతో ఆయన అంటీముట్టనట్టే ఉంటున్నారు. విజయవాడ పశ్చిమలోనూ ఇదే తరహా పరిస్థితి కనిపిస్తోంది. అసలు ఈ టికెట్ తమకే ఇవ్వాలని టీడీపీ నాయకులు పోరు పెడుతు న్నారు. దీంతో ఇక్కడ కూడా కలివిడి లేకుండా పోవడంతో జనసేనలో అలజడి మొదలైంది.
మొత్తంగా టికెట్ ఆశిస్తున్న వారు.. టికెట్ కన్ఫర్మ్ అయిన వారు కూడా.. దాదాపు అంతర్గత కుమ్ములాట తో ఇరుకున పడుతుండడం గమనార్హం. ఇక, ఉత్తరాంధ్రలో కొణతాల రామకృష్ణ పార్టీలో చేరతానని చెప్పారు. ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఆయన పోటీ చేయాలని అనుకుంటున్నట్టు వార్తలు వస్తున్నప్పటికీ.. ఆయన కోరుతున్న అనకాపల్లి టికెట్పై సందేహాలు ఉన్నాయి. దీంతో ఆయన కూడా అంతర్గతంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. పార్టీలో చేరినా.. ఏమేరకు ఆయన ప్రభావం చూపిస్తారనేది ప్రశ్నగానే మారింది.
విజయనగరం జిల్లాతో పాటు గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో తమను కాదని టీడీపీకి సీటు ఇస్తే ఇండిపెండెంట్లుగా పోటీ చేస్తామని చాలా మంది నేతలు సవాళ్లు రువ్వుతున్నారు. వీరిని కంట్రోల్ చేసేందుకు పవన్ నాదెండ్ల మనోహర్ను, నాగబాబును ప్రయోగిస్తున్నా కూడా ఎవ్వరూ మాట వినే పరిస్థితుల్లో లేరు. మొత్తానికి ఈ అంతర్గత సమస్యలను పవన్ ఎలా ఛేదిస్తారో చూడాలి.