న్యూఢిల్లీ: ప్రధానమంత్రి ఉచిత ల్యాప్టాప్ పంపిణీ పధకం పేరుతో రెండు రోజుల్లో 15 లక్షల మంది పర్సనల్ డేటా కాజేశాడా ఐఐటి పట్టభద్రుడు. ఢిల్లీ పోలీసులు అతనిని రాజస్థాన్లో అరెస్టు చేశార.
లోక్సభ ఎన్నికలలో బిజెపి విజయం సాధించిన సందర్భంగా ప్రధాని మోదీ పేరున ప్రభుత్వం ఉచితంగా రెండు కోట్ల మందికి ల్యాప్టాప్ పంపిణీ చేస్తోందన్న సందేశాన్ని రాకేష్ జంగిద్ వాట్సాప్ ద్వారా చలామణీ చేశాడు. దానికి ఒక వెబ్సైట్లో పేరు రిజిస్టర్ చేసుకోవాలని అందులో పేర్కొన్నాడు. వెబ్సైట్ రిజిస్ట్రేషన్ పేరుతో అందులో వ్యక్తిగత వివరాలు అన్నీ నమోదు చేయించాడు.
ఇలాంటి మోసం జరగడం ఇదే మొదటిసారని ఢిల్లీ సైబర్ క్రయిం స్పెషల్ సెల్ డిప్యూటీ కమిషనర్ అన్యేష్ రాయ్ ఇండియన్ ఎక్స్ప్రెస్తో అన్నారు. ఈ మోసం గురేంచి పోలీసులకు ఎవరూ ఫిర్యాదు చేయలేదు. ఆన్లైన్ కార్యకలాపాల మీద నిఘాలో ఆ వెబ్సైట్కు ట్రాఫిక్ అసాధారణంగా పెరగడంతో అనుమానంపై దర్యాప్తు చేశామని ఆయన అన్నారు.