కరోనా రాకుండా మనల్ని మనం రక్షించుకునేందుకు ఎలాంటి మాస్కు ధరించినా చాలు. సాధారణ క్లాత్ మాస్కులు మొదలుకొని రూ.100 వరకు ఖరీదు చేసే ఎన్ 95 మాస్కులు కూడా మనకు లభిస్తున్నాయి. అవి కరోనా రాకుండా మనకు ప్రొటెక్షన్ను ఇస్తాయి. అయితే కొందరు మాత్రం సోకులకు పోయి రూ. లక్షలు వెచ్చించి బంగారం, వజ్రాలతో కరోనా మాస్కులను తయారు చేయించుకుని మరీ ధరిస్తున్నారు. ఇది చాలదన్నట్లు.. ఆ కంపెనీ ఇంకాస్త ఎక్కువ ధరతోనే మాస్కులను తయారు చేసి విక్రయిస్తోంది.
ఇజ్రాయెల్కు చెందిన వైవెల్ అనే కంపెనీ 18 క్యారెట్ల బంగారం, 3600 వజ్రాలతో కరోనా మాస్కులను తయారు చేస్తోంది. వాటికి ఎన్99 ఫిల్టర్లను అమర్చారు. అందువల్ల మాస్క్ వైరస్ల నుంచి రక్షణ ఇస్తుంది. అయితే ఆ మాస్కు ధర అక్షరాలా 1.5 మిలియన్ డాలర్లు. మన కరెన్సీలో దాదాపుగా రూ.11 కోట్లు. బాప్రే.. అని కళ్లు తేలేయకండి. ఎందుకంటే.. ఆ మాస్కుల కోసం ఇప్పుడు బాగా డిమాండ్ ఉందట.
సదరు మాస్కులను కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తుండడంతో వైవెల్ కంపెనీ ఇంకొన్ని మాస్కులను తయారు చేస్తోంది. ఈ ఏడాది డిసెంబర్ వరకు ఎక్కువ సంఖ్యలో మాస్కులను తయారు చేస్తామని ఆ కంపెనీ చెబుతోంది. దీంతో ఆ మాస్కుల కోసం కొందరు క్యూలు కడుతున్నారు. అంతేలే.. డబ్బున్న వాళ్లు అలాంటి సోకులకు పోవడం మామూలే కదా..!