NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

మైండ్ బ్లాక్‌: వియ్యంకుడి దెబ్బ‌తో ఆయ‌న‌కు రాజ్య‌స‌భ క్యాన్సిల్ చేసిన జ‌గ‌న్‌…!

కాపు సామాజిక వ‌ర్గం ఓట్లు వ‌చ్చే ఎన్నిక‌ల్లో కీల‌కంగా మారిన విష‌యం తెలిసిందే. టీడీపీ-జ‌న‌సేన పార్టీల పొత్తు వెనుక కూడా ఈ వ్యూహం ఉంది. కాపుల‌ను మ‌చ్చిక చేసుకోవ‌డం ద్వారా వ‌చ్చే ఎన్నిక‌ల్లో వీరి ప్రాబ ల్యం ఉన్న సీట్ల‌లో విజ‌యం ద‌క్కించుకుని అధికారం చేప‌ట్టాల‌నేది వీరి ప్ర‌య‌త్నం. ఈ క్ర‌మంలోనే ప్ర‌తిప‌క్ష పార్టీలు చాలా వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నాయి. అయితే.. వీరి ప్ర‌య‌త్నాల‌ను ఆది నుం చి గ‌మ‌నిస్తున్న వైసీపీ.. వీరి వ్యూహాల‌కు ప్ర‌తివ్యూహాలు రెడీ చేస్తూనే ఉంది.

Jagan canceled the Rajya Sabha
Jagan canceled the Rajya Sabha

 

తాజాగా కాపు నేత కోసం.. ఓ కీలక ఎమ్మెల్యే విష‌యంలో వైసీపీ వ్య‌వ‌హ‌రించిన తీరు.. పార్టీలో చ‌ర్చ‌గా మారింది. అయితే.. ఇది మేలు చేస్తే మంచిదే, కానీ, వ్యూహం రివ‌ర్స్ అయితే మాత్రం ఇబ్బంది త‌ప్ప‌ద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.. ప్ర‌స్తుతం మూడు రాజ్య‌స‌భ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ముగ్గురు నేత‌ల‌ను సీఎం జ‌గ‌న్ వైసీపీ త‌ర‌ఫున ఎంపిక చేశారు. వీరిలో ఇద్ద‌రు రెడ్లు, ఒక ఎస్సీ ఎమ్మెల్యే ఉన్నారు. అయితే, ఆదిలో ఒక రెడ్డి-ఒక కాపు -ఒక ఎస్సీని ఎంపిక చేయాల‌ని బావించారు.

అందుకే.. హుటాహుటిన కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన‌ చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు ఇస్తున్న‌ట్టు ప్ర‌చారంలోకి తెచ్చారు. అందుకే చిత్తూరు అసెంబ్లీలో ఆయ‌న్ను త‌ప్పించి రెడ్డి నేత‌కు అసెంబ్లీ టిక్కెట్ ఇచ్చారు. దీంతో మంచి ఈక్వేష‌న్ అని అంద‌రూ అనుకున్నారు. అయితే ఆయన్ను చివరి నిమిషంలో వ్యూహాత్మకంగా తప్పించేసిన వైసీపీ, ఆరణి శ్రీనివాసులు స్థానంలో మేడా రఘునాధ రెడ్డి పేరును తెరపైకి తీసుకొచ్చింది. మేడా రఘునాధ రెడ్డి పేరు తెర మీదకు రావడంలో ఆసక్తికరమైన సమీకరణాలు ఉన్నట్లు చర్చ జరుగుతోంది.

Jagan canceled the Rajya Sabha
Jagan canceled the Rajya Sabha

గుంటూరుకు చెందిన కాపు నాయ‌కుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తనయుడు ఉమ్మారెడ్డి వెంకట రమణకు గుంటూరు లోక్‌సభ స్థానం కేటాయించారు. ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తనయుడికి ఆరణి శ్రీనివాసులు వియ్యంకుడు కావ‌డంతో ఆయ‌న‌ను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. బలిజ సామాజిక వర్గానికి చెందిన ఆరణి శ్రీనివాసులు కంటే.. ఉమ్మారెడ్డి తనయుడికి టిక్కెట్‌ ఇస్తే కాపు సామాజికవర్గం ఓట్లు పడతాయనే లెక్కలు వేసుకున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్ప‌టికే కాపు నేత‌ల‌కు ప‌లు ఎమ్మెల్యే సీట్ల‌తో పాటు కాకినాడ‌, బంద‌రు, గుంటూరు పార్ల‌మెంటు సీట్లు కేటాయించిన సంగ‌తి తెలిసిందే. మ‌రి ఈవ్యూహం వ‌ర్క‌వుట్ అవుతుందా? లేదా? అనేది చూడాలి.

Related posts

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

kavya N

Supreme Court: ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీం సీరియస్ .. కీలక ఆదేశాలు జారీ

sharma somaraju

EC: పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు వేసిన ఈసీ .. మరి కొందరిపై బదిలీ వేటు

sharma somaraju

AP Elections: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీకి వ్యక్తిగతంగా వివరణ ఇచ్చిన సీఎస్, డీజీపీ

sharma somaraju

CM YS Jagan: ఏపీ ఎన్నికల ఫలితాలు దేశంలోని ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తాయన్న సీఎం జగన్

sharma somaraju

భారీ భద్రత మధ్య జేసీ ఫ్యామిలీ హైదరాబాద్ తరలింపు.. ఎందుకంటే..?

sharma somaraju

Tollywood Actor: ఇత‌నెవ‌రో గుర్తుప‌ట్టారా.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా వ‌చ్చి హీరోగా అద‌ర‌గొట్టి చివ‌ర‌కు ఇండ‌స్ట్రీలోనే లేకుండా పోయాడు!

kavya N

Sai Pallavi-Sreeleela: సాయి ప‌ల్ల‌వి – శ్రీ‌లీల మ‌ధ్య ఉన్న ఈ కామ‌న్ పాయింట్స్ ను గ‌మ‌నించారా..?

kavya N

Serial Actress Sireesha: ఇండ‌స్ట్రీలో మ‌రో విడాకులు.. భ‌ర్త‌తో విడిపోయిన‌ట్లు ప్ర‌క‌టించిన ప్ర‌ముఖ సీరియ‌ల్ న‌టి!

kavya N

Janhvi Kapoor: జాన్వీ మెడ‌లో మూడు ముళ్లు వేయాలంటే ఈ క్వాలిటీస్ క‌చ్చితంగా ఉండాల్సిందే అట‌!

kavya N

Janga Krishna Murty: వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు

sharma somaraju

Mrunal Thakur: ప్రియుడితో మృణాల్ ఠాకూర్ డిన్న‌ర్ డేట్‌.. అస‌లెవ‌రీ సిద్ధాంత్ చతుర్వేది..?

kavya N

జూన్ 1 వ‌ర‌కు పాల‌న ఎవ‌రిది? చంద్ర‌బాబే అన్నీనా?

ఏపీ చ‌రిత్ర‌లోనే ఇవ‌న్నీ తొలిసారి.. మీరు గ‌మ‌నించారా ?

నాడు గెలిపించి.. నేడు ఓడించేందుకు.. పీకే ప్లాన్‌లో కొత్త ట్విస్ట్ ఇదే..?