Janhvi Kapoor: జాన్వీ కపూర్.. ఇండియన్ సినీ ప్రియులకు ఈ ముద్దుగుమ్మను పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రముఖ నిర్మాత బోనీ కపూర్, దివంగత నటి శ్రీదేవి దంపతులకు పెద్ద కుమార్తెగా జన్మించిన జాన్వీ కపూర్.. తన తల్లిదండ్రుల బాటలోనే చిత్ర పరిశ్రమ వైపు అడుగులు వేసింది. హీరోయిన్ గా ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు గట్టిగా కష్టపడుతోంది. 2018 లో ధడక్ మూవీతో బాలీవుడ్ లో హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన జాన్వీ కపూర్.. తొలి ప్రయత్నం లోనే నటిగా తనను తాను నిరూపించుకుంది.
ఆ తర్వాత బాలీవుడ్ లో వరుస సినిమాలు చేసింది. కానీ సరైన హిట్ మాత్రం పడలేదు. అయినా సరే జాన్వీ కపూర్ కు అవకాశాలు మాత్రం ఆగడం లేదు. ప్రస్తుతం జాన్వీ కపూర్ చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ సంగతి పక్కన పెడితే.. సోషల్ మీడియాలో జాన్వీ ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేవలం ఇన్స్టాగ్రామ్ లోనే 24 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారంటే జాన్వీ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. హాట్ హాట్ ఫోటో షూట్లతో నెట్టింట జాన్వీ పుట్టించే హీట్ అంతా ఇంతా కాదు.
ఎప్పటికప్పుడు తన అందాలతో ఫాలోవర్స్ కు ఫుల్ మీల్స్ పెడుతుంటుంది. ఒక రకంగా సినిమాలకన్నా సోషల్ మీడియాలో అందాల ఆరబోతుతోనే జాన్వీ ఎక్కువ పాపులారిటీని సంపాదించుకుంది. తాజాగా మరోసారి మినీ డ్రెస్ లో గ్లామర్ మెరుపులు మెరిపించింది. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమానికి జాన్వీ కపూర్ హాజరైంది. అందమైన బ్లాక్ అండ్ వైట్ చెక్స్ ఉన్న మినీ ఫ్రాక్ ధరించి సదరు కార్యక్రమంలో అందరినీ ఎట్రాక్ట్ చేసింది. సేమ్ డ్రెస్ లో ఉన్న కొన్ని ఫోటోలను జాన్వీ ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది.
ఈ ఫోటోలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారాయి. బుల్లి గౌనులో జాన్వీ అందాలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. జాన్వీ గ్లామర్ షోకు ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. ఇక జాన్వీ అందం గురించి పక్కన పెడితే.. ఆమె ధరించిన మినీ ఫ్రాక్ ధర హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఈ షార్ట్ డ్రెస్ ఖరీదు అక్షరాల రూ. 1.7 లక్షలు. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లకు దిమ్మతిరిగిపోతుంది. ఒక్క ఫ్రాక్ కోసం జాన్వీ అంత ఖర్చు పెట్టిందా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, సినిమాల విషయానికి వస్తే.. టాలీవుడ్ లో జాన్వీ కపూర్ రెండు భారీ ప్రాజెక్ట్లకు సైన్ చేసింది. అందులో దేవర ఒకటి. రెండు భాగాలుగా రాబోతున్న ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరో కాగా.. ఆయనకు జోడిగా జాన్వీ ఖరారైంది. అలాగే బుచ్చిబాబు, రామ్ చరణ్ కాంబినేషన్ లో ఓ సినిమా సెట్ అయింది. ఆర్సీ16 వర్కింగ్ టైటిల్ తో ఇటీవలె ఈ చిత్రం ప్రారంభమైంది. అయితే ఈ సినిమాలో కూడా జాన్వీ కపూర్నే హీరోయిన్ గా తీసుకున్నారు. బాలీవుడ్ లో సన్నీ సంస్కారీ కి తులసీ కుమారి అనే మూవీలో జాన్వీ నటిస్తోంది. అంతేకాకుండా జాన్వీ నటించిన మిస్టర్ & మిసెస్ మహి, ఉలాజ్ చిత్రాలు షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవుతున్నాయి.