ప్రతిరోజు కొత్త రకం కరోనా వైరస్ గురించి వస్తున్న వార్తలు చూసి ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతున్నారు. ఒకపక్క కొన్ని దేశాలకు వ్యాక్సిన్ పంపిణీ జరుగుతున్న కూడా ఈ వైరస్ గురించి ఇంత హైలైట్ చేస్తున్నారు అంటే అసలు దీని వ్యవహారం ఏమిటో చూద్దాం…
మొట్టమొదటిసారి బ్రిటన్ లో కరోనా వైరస్ సరికొత్త స్ట్రైన్ ను కనుక్కున్నారు. సాధారణ వైరస్ కన్నా అనేక ప్రత్యేక లక్షణాలతో మరింత ప్రాణాంతకం కనిపిస్తున్నా ఈ స్ట్రైన్ ఎంతో డేంజర్ అని శాస్త్రవేత్తలు చెప్పారు. అయితే మరికొందరు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. కానీ ఆ తర్వాత రెండవ రకం బ్రిటన్లోని బయటపడింది. వెంటనే రెండు రోజులకి ఆఫ్రికాదేశంలో నైజీరియా లో మూడవ రకం స్ట్రైన్ బయటపడింది. దీంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు. శాస్త్రవేత్తలు కూడా దీనికి కారణం చెప్పలేకపోతున్నారు.
ఇకపోతే ప్రపంచవ్యాప్తంగా విమాన సర్వీసులు నిలిచిపోయాయి. లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ సైంటిస్టులు చేసిన పరిశోధన లో బయటపడిన స్ట్రైన్ పై పరిశోధనలు చేపట్టారు. ఇక వారు చెప్పిన రిపోర్టు ఏమిటంటే కొత్తగా వచ్చిన ఈ స్ట్రైన్ చాలా డేంజర్ అని… పాత వైరస్ కంటే రెట్టింపు వేగంతో విస్తరిస్తుంది అని… దాని కారణంగా ఇది జనాల్లో ఎన్నో కొత్త లక్షణాలను చూపిస్తుంది అని కూడా హెచ్చరించారు.
అన్నిటికన్నా కంగారు కలిగించే విషయం ఏమిటంటే పాట వైరస్ తో పోలిస్తే కొత్త వైరస్ వల్ల మరణించే వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉండొచ్చట. కొత్త స్ట్రైన్ విజృంభిస్తే ఆసుపత్రులు కూడా సరిపోవని హెచ్చరిస్తున్నారు. భారతదేశంతో సహా ప్రపంచ దేశాలు అన్ని ఒక్కసారిగా అలెర్ట్ అయ్యాయి. ఇక బ్రిటన్ నుండి తెలంగాణ రాష్ట్రానికి 120 మంది వచ్చారు. వాళ్ళ ఏడుగురిలో కొత్త స్ట్రైన్ లక్షణాలు కనిపించాయి. తర్వాత కార్యాచరణపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది.