అమరావతి:గత రెండ్రోజులుగా శాసనసభలో జరిగిన పరిణామాలపై టీడీపీ సభ్యులు స్పీకర్ తమ్మినేని సీతారాంను కలిసి వినతిపత్రం సమర్పించారు. సభా సంప్రదాయాల ఉల్లంఘన జరుగుతోందని టీడీపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. శాసనభలో ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.సస్పెన్షన్ కు గురైన టీ డి పి సభ్యుడు వల్లభనేని వంశీకి ప్రత్యేకంగా ఎలా సిటు కేటాయించారని తమ వినతిపత్రంలో ప్రస్తావించారు. ఈ ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవాలనీ, ప్రజాస్వామ్య విధానాలను కాపాడాలని టీడీఎల్పీ సభ్యులు విజ్ఞప్తి చేశారు.
previous post
next post