వైసీపీ నాయకుడు, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్కు టీడీపీ అధినేత చంద్రబాబు టికెట్ కన్ఫ ర్మ్ చేశారు. వచ్చే ఎన్నికల్లోనూఆయనకు సిట్టింగ్ సీటునే ఇచ్చేందుకు చంద్రబాబు మొగ్గు చూపారు.
క్షేత్రస్థాయిలో అనేక సర్వేలు.. నాయకుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న దరిమిలా.. వసంత కే టికెట్ ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. తాజాగా ఆయన మీడియాకు ఇచ్చిన సమాచారంలోనూ వసంతకే మైలవరం టికెట్ దక్కనున్నట్టు తెలుస్తోంది.
ఇక, ఇదే టికెట్ను ఆశిస్తున్న మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమాను పక్కన పెట్టారు. ప్ర స్తుతానికి ఆయనను బుజ్జగించే చర్యలు ముమ్మరమయ్యాయి. ఒకవైపు.. పార్టీ ఏపీఅ ధ్యక్షుడు అచ్చెన్నా యుడు దేవినేనితో భేటీ అయ్యారు. పార్టీకోసం త్యాగం చేయాలని సూచించారు. అధికారంలోకి రాగానే గౌరవ ప్రదమైన పోస్టును ఇవ్వనున్నట్టు తెలిపారు. దీనికిముభావంగానే దేవినేని తలూపారు. అయితే.. క్షేత్రస్తాయిలో ఆయన ఏమేరకు కలిసి పనిచేస్తారనేది ప్రశ్న.
మరోవైపు ఇదే నియోజకవర్గంలో బొమ్మసాని వర్గం వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. నిన్న మొన్నటి వరకు వసంత మనపై కత్తికట్టారని, టీడీపీ నేతలపై కేసులు పెట్టించారని..ఇలాంటి నాయకుడికి పనిచేయబో మని చెబుతున్నారు. కొందరు జనసేన నాయకులు కూడా ఇదే వాదన వినిపిస్తున్నారు. వసంతకు వ్యతిరేకంగా ర్యాలీలు కూడా చేపట్టారు. మరోవైపు.. వసంత దూకుడు పెంచేస్తున్నారు. మంగళగిరిలో ఏకంగా రెండు ప్రచార వాహనాలు సిద్ధం చేస్తున్నారు.
ఒకటి తనకు, రెండో పార్టీ కీలక నాయకుడు దేవినేని ఉమను సంతృప్తిపరిచి ఆయనకు ఆ వాహనం ఇవ్వనున్నట్టు ప్రచారం జరుగుతోంది. తద్వారా.. ప్రచరాన్ని పరుగులు పెట్టించాలని ఆయ ప్లాన్ చేస్తున్నారు. రెండు కోట్లు కర్చు పెట్టి మరీ ఈవాహనాలు రెడీ చేస్తున్నారు. అయితే దేవినేని వర్గం తమకు వాహనాలు అవసరం లేదని తేల్చి చెప్పడం మరో వివాదంగా మారింది. మరి దీనిపై వసంత ఎలా రియాక్ట్ అవుతారనేది చూడాలి.ఏదేమైనా.. నియోజకవర్గంలో గెలుపు మాట ఎలా ఉన్నా.. అసంతృప్తులను బుజ్జగించేందుకు చాలానే చేయాల్సి ఉంటుందని అంటున్నారు పరిశీలకులు.