(న్యూస్ అర్బిట్ డెస్క్)
ఒక మహిళ ఆలయంలో దీపారాధన చేసి తాపీగా నడుచుకుంటూ వెళుతోంది. అయితే ఆమె చీరకు నిప్పు అంటుకున్న విషయం గుర్తించలేదు. నాలుగు అడుగులు వేసిందో లేదో చీర అంచునుండి ఉవ్వెత్తున మంటలు ఎగిసిపడ్డాయి. వెంటనే చుట్టుపక్కన ఉన్న మహిళలు, పురుషులు ఆమెకు సహాయపడేందుకు వెళ్లారు. ఆమె కాలిపోతున్న చీరను విప్పేందుకు పక్కనే ఉన్న రూమ్లోకి పరుగుపరుగున వెళ్లింది. అప్పటికే ఆమెకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ఘటన కర్నాటక రాష్ట్రంలోని హుబ్బళ్లిలో ఉన్న విశ్వనాధ మందిరంలో రెండు రోజుల క్రితం జరిగింది. గాయపడిన ఆమెను హుటాహుటిన కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన మొత్తం ఆలయంలో అమర్చిన సిసి టీవి కెమెరాలో రికార్డు అయ్యింది.
నేడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆలయాలలో దీపారాధన సమయంలో మహిళలు జాగ్రతలు పాటించాలని సూచిస్తున్నారు.
టివి 9 కన్నడ ఛానల్ సౌజన్యంతో వీడియో….