Corona Virus : ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్ చైనాలో పుట్టిన సంగతి తెలిసిందే. 2019 వ సంవత్సరంలో నవంబర్ మాసంలో చైనా దేశంలో బయటపడ్డ ఈ వైరస్ అతి తక్కువ నెలలోనే ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందింది. చాలా మంది మనుషులను బలి తీసుకోవడమే కాక ప్రపంచ దేశాల ఆర్థిక మూలాలను బాగా దెబ్బ తీయడం జరిగింది. ఇదిలా ఉంటే కావాలని డ్రాగన్ కంట్రీ చైనా దేశం ప్రపంచంలో కి ఈ మహమ్మారిని ల్యాబ్ నుండి రిలీజ్ చేయడం జరిగింది అంటూ అప్పట్లో చాలా దేశాల ప్రతినిధులు ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఫిర్యాదు చేయడం జరిగింది.
Corona Virus వైరస్ ప్రపంచంలోకి
వైరస్ ప్రపంచంలోకి రిలీజ్ చేయటం వెనకాల చైనా హస్తం ప్రధానమైనదని, అన్ని దేశాల ఆర్థిక మూలాలను దెబ్బతీయడానికి దురుద్దేశంతో వైరస్ సృష్టించి వదలటం జరిగిందని చెప్పుకొచ్చారు. ఇటువంటి తరుణంలో తాజాగా అసలు ఈ వైరస్ బయట ప్రపంచం లోకి రావడానికి గల కారణం ఏంటో అన్నదానిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు చైనాలో పర్యటించిన సంగతి తెలిసిందే. దాదాపు పది మందికి పైగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు వైరస్ పుట్టిన ప్రాంతం వుహాన్ లో పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా అక్కడ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిపుణుల బృందం పలు పరిశోధనలు మరియు కరోనా వైరస్ లెక్కలు స్టార్టింగ్ లో ఎవరికైతే సోకిందో వారితో మీటింగులు ఆయు ఆరోగ్య వివరాలు తెలుసుకుని ఓ అంచనాకు రావడం జరిగింది. అయితే కచ్చితంగా జంతువుల నుంచి మనుషులకు సోకింది అనే అంచనాకు పరిణామాలపై పంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు వచ్చినట్టు సమాచారం.
ముఖ్యంగా గబ్బిలాల కానీ మనుషులకు సంక్రమించినట్లు నిపుణులు చేపట్టిన పరిశోధనలో తేలిందట. ఇదే విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు ఇటీవల ఓ కార్యక్రమంలో తెలపడం జరిగింది. అంతమాత్రమే కాకుండా కోవిడ్ పుట్టుక, వ్యాప్తిపై నిర్ధారణకు వచ్చేందుకు మరింత అధ్యయనం జరగాల్సి ఉందని తెలిపారు. మొత్తంమీద చూసుకుంటే జంతువులనుండి మనుషులకు దొరికినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు ఓ అంచనాకు రావడం జరిగింది.