మోపిదేవి వెంకటరమణ రాజ్యసభకు వెళ్లడంతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి డాక్టర్ పెనుమత్స సురేష్ బాబు పేరుని ఖరారు చేసారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ చీఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈరోజు అధికారికంగా పేరుని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఈ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించిన నోటిఫికేషన్ జారీ అయింది.
నామినేషన్ దాఖలుకు ఈ నెల 13 చివరి తేదీ. మొదట వేరే వారి పేరుని జగన్ అనుకున్నా చివరి నిమిషంలో మార్పు చేసినట్లు సమాచారం. డాక్టర్ పెనుమత్స సురేష్ బాబు, మొదటినుండీ వైసీపీతో ఉంటూ వస్తోన్న పెనుమత్స సాంబశివరాజు కుమారుడు. సోమవారం సాంబశివరాజు కన్నుమూశారు. ముఖ్యమంత్రి జగన్ ఫోన్ లో ఆయన కుటుంబాన్ని పరామర్శించి వైసీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఇందుకోసమే మనసు మార్చుకుని సురేష్ బాబుని ఎమ్మెల్సీ స్థానానికి ఖరారు చేసినట్లు తెలుస్తోంది.