ఇటీవల రాష్ట్రంలో దివ్య తేజస్విని అనే అమ్మాయి హత్య ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. విజయవాడ లో ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన దివ్య తేజస్విని తల్లిదండ్రులు ఇటీవల జగన్ ని క్యాంప్ ఆఫీస్ లో కలవడం జరిగింది. ఈ నేపథ్యంలో సీఎంకి వినతి పత్రం అందజేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు దివ్య తల్లిదండ్రులు. ఈ మేరకు నిందితుడి పై కఠిన చర్య తీసుకుంటామని సీఎం జగన్ వారికి హామీ ఇచ్చారు. అంతే కాకుండా ఇటువంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారు.
అదే విధంగా తేజస్విని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు చూసి జగన్ చలించిపోయారు. చేతికొచ్చిన అమ్మాయి ఓ ప్రేమోన్మాది చేతిలో చనిపోవడంతో… వారు చెబుతున్న బాధను విని జగన్ బాధ పడ్డారు. దీంతో దివ్య తేజస్విని కుటుంబ సభ్యులకు 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయాన్ని ప్రకటించారు జగన్. ఈ సందర్భంగా మాట్లాడిన దివ్య తల్లిదండ్రులు కచ్చితంగా న్యాయం జరుగుతుంది అనే భావన వ్యక్తం చేశారు.
తమ కూతురు చనిపోయిన ఘటన విషయంలో హోంమంత్రి సుచరిత ఏ విధంగా ఆదరించారు, ధైర్యం చెప్పారు వంటి విషయాలు కూడా మీడియాతో దివ్య తల్లిదండ్రులు పంచుకున్నారు. తర్వాత మీడియాతో మాట్లాడిన హోమ్ మంత్రి సుచరిత… నిందితుడిపై ఇప్పటికే పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు చేయడం జరిగిందని స్పష్టం చేశారు. ఇంకా పూర్తిస్థాయిలో నిందితుడిపై కఠిన శిక్షలు అమలు అయ్యేలా చర్యలు తీసుకోబోతున్నట్లు సుచరిత స్పష్టం చేశారు.