సినీ నటుడు సుమన్ ఇటీవల ఓ ప్రముఖ టీవీ న్యూస్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్ పరిపాలన విషయంలో తీసుకున్న నిర్ణయాలపై తాజా రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. పంచాయతీ ఎన్నికలు సరైన సమయంలో జరిగితే బాగుండేది అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల బట్టి ఉద్యోగస్తులను అదేవిధంగా ప్రజలను ఇబ్బంది పెట్టే రీతిలో నిర్ణయం తీసుకోవటం దారుణమని స్పష్టం చేశారు.
మూడు రాజధానులు మ్యాటర్ గురించి మాట్లాడుతూ.. కరెక్ట్ నిర్ణయం తీసుకున్నారని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని ఒక ప్రాంతానికి పరిమితం చేసి తప్పు చేశారని పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో ఆలయాల పై జరుగుతున్న దాడులు వెనకాల కుట్ర కోణం ఉంది అని, దాన్ని అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి జగన్ పై ప్రతిపక్షాలు విమర్శలు చేయడం దారుణమని సుమన్ తేల్చిచెప్పారు. అదే రీతిలో రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న జగన్ అతి తక్కువ సమయంలోనే భారీ స్థాయిలో సంక్షేమ పథకాలు అమలు చేశారు అని కొనియాడారు. అతి తక్కువ సమయంలోనే రాష్ట్రంలోని పేద మహిళలకు లక్షలాది ఇంటిపట్టాలు పంపిణీ చేయడం అద్భుతం. ప్రతి రాష్ట్రంలోని పాలకులు దీన్ని ఆదర్శంగా తీసుకోవాలి అని సూచించారు. మొత్తంమీద ఆంధ్రప్రదేశ్ ప్రజలు యంగ్ అండ్ ఎనర్జిటిక్ సీఎంను ఎన్నుకున్నారు, రాష్ట్రంలో సాధారణ మరియు మధ్యతరగతి ప్రజలు జగన్ పాలన పట్ల గ్యారంటీగా సంతోషంగా ఉన్నారనేది నా అభిప్రాయం అంటూ సుమన్ చెప్పుకొచ్చారు.