ఈ ఫోటోలో కనబడుతున్న యువతి ఎవరో తెలుసా? ఆమెకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర స్థాయి పదవి కట్టబెట్టింది. పార్టీలో చేరిన నాలుగు నెలల కాలంలోనే ఆమె కు అంత గుర్తింపు ఇవ్వడానికి కారణం ఏమైఉంటుంది అంటారు. అందుకూ కారణం ఉంది.
ఆమె ఎవరో కాదు..ఒకప్పుడు దక్షిణాది రాష్ట్రాలను గడగడలాడించిన గంధపు చెక్కల స్మగ్లర్, అడవి దొంగ వీరప్పన్ కుమార్తె విద్యా వీరప్పన్.
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కడుపుతున్నది. అందులో భాగంగా ఒకప్పుడు దక్షిణాది రాష్ట్రాలను గడగడలాడించిన గంధపు చెక్కల స్మగ్లర్, అడవి దొంగ వీరప్పన్ కుమార్తె విద్యా వీరప్పన్కు బీజేపీలో కీలక పదవి ఇచ్చింది. తమిళనాడు యువ మోర్చా విభాగం ఉపాధ్యక్షురాలిగా ఆమెను బీజేపీ నియమించింది. వృత్తి రీత్యా న్యాయవాది అయిన విద్యా వీరప్పన్ ఈ ఏడాది ఫిబ్రవరిలోనే బీజేపీలో చేరారు. అప్పటి నుంచి ఆమె పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.
త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో వీరప్పన్ వర్గీయులను తమ వైపుకు ఆకర్షించుకునేందుకు గాను బీజేపీ ప్రణాళిక అమలు చేసింది. అందులో భాగంగానే విద్య వీరప్పన్ కు రాష్ట్ర స్థాయిలో పదవి ఇచ్చినట్లు తెలుస్తోంది.
మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్గా పేరొందిన వీరప్పన్ 2004లో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే.