తెలంగాణ రాష్ట్ర పాత సచివాలయం కూల్చివేత పనులు ముమ్మరంగా జరుగుతున్న సమయంలో కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర హైకోర్టు ఆ పనులను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే ఇదే సమయంలో లో కూల్చివేత పనులు సగంలో ఆపడం సాధ్యం కాదని తెలంగాణ ప్రభుత్వం తెలిపిన విషయం కూడా విధితమే.
అయితే కూల్చివేత పనుల్లో భాగంగా తెలంగాణ సెక్రటేరియట్ భవనంలోని కొంత భాగం పక్కనే ఆనుకుని ఉన్న ప్రార్థన మందిరం పై పడి ప్రార్థన మందిరం దెబ్బతినడం గమనార్హం. అయితే ఈ విషయమై వెంటనే తెలంగాణ హోం మంత్రి మహమ్మద్ మరియు ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పందించి ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన అని పేర్కొన్నారు.
ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ ఈ సంఘటన జరిగినందుకు తాను ఎంతో చింతించానని మరియు ఇంకా ఎక్కువ విస్తీర్ణం స్థలంలో మసీదు మరియు ఆలయం నిర్మాణం చేపట్టేందుకు సన్నాహాలు ఎప్పటినుండో చేస్తున్నామని…. ఎవరూ ఎటువంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదని అన్నారు. చాలా ఘనమైన రీతిలో మసీదు మరియు ఆలయం నిర్వమిస్తామని ఆయన తెలిపారు.
మహమ్మద్ మరియు ఒవైసీ కూడా కేసీఆర్ పైన తమకు నమ్మకం ఉందని అతను ఖచ్చితంగా చెప్పినట్లు ప్రార్థనా మందిరాలను నిర్మిస్తాడని తాము ఆశిస్తున్నట్లు అన్నారు. ఇక సోమవారం వరకూ ఎటువంటి పనులు జరపరాదని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన సమయంలో ఇలా భవనపు చరియలు వచ్చి పక్కనే ఉన్న ప్రార్థన మందిరం పై పడటం గమనార్హం. అయితే తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా కూల్చివేసి హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తుందా లేదా సరైన వివరణ తో మళ్లీ హైక్Pర్టుని ఒప్పించి పనులను పునః ప్రారంభిస్తుందా అన్న విషయం ఇక్కడ ఆసక్తికరం.