ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో మారు క్యాబినెట్ మీటింగ్ ను నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన ఈ క్యాబినెట్ మీటింగ్ జరగనుంది. జులై 15న ఈ మీటింగ్ జరుగుతుందని అధికారికంగా వెల్లడైంది.
ఈ క్యాబినెట్ భేటీలో పలు సమస్యలపై మంత్రులు, సీఎం చర్చించనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభలిస్తోంది. నివారణకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కానీ ఎక్కడా కంట్రోల్ అవ్వని నేపథ్యంలో ప్రధానంగా దీనిపైనే చర్చ సాగనుంది. ఇప్పటికే రాష్ట్రంలో 11 లక్షల టెస్టులను పూర్తి చేసారు. మరింత వేగంతో టెస్టులు చేయడానికి ప్రతి జిల్లాకు మొబైల్ టెస్టింగ్ బస్సులను కూడా పంపుతున్నారు. దీంతో పాటు రాష్ట్రంలో అమలు కావాల్సిన అభివృద్ధి పథకాలపై కూడా చర్చ సాగనుంది.