ఓఎల్ఎక్స్ లో మోసాలు అధికమయ్యాయి ఆన్ లైన్ లొసుగులను వినియోగించుకుని దుండగులు మోసాలు చేస్తున్నారు.
ఓ క్యూఆర్ కోడ్ పంపించి దాన్ని స్కాన్ చేస్తే మీ ఎకౌంట్ లోకి డబ్బులు పడతాయని మీ ఎకౌంట్ లో డబ్బులు పడిన వెంటనే ఇంటికొచ్చి వస్తువు తీసుకెళ్తామని చెబుతారు. అయితే ముందే డబ్బులు వస్తున్నాయనే ఆశతో చాలామంది ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నారు. ఇలా చేయడంతో బ్యాంకు ఖాతాలో డబ్బులు పడకపోగా మన ఖాతాలో ఉన్న డబ్బులు మాయమవుతున్నొయి. ఇలాంటి మోసాలు పెద్ద సంఖ్యలో జరుగుతుండడం పోలీసులకు తలనొప్పిగా మారింది. అందుకే ఏకంగా ఆ సైట్ ను నిషేధించాలని పోలీసులు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు..పాతది ఏదైనా ఈజీగా అమ్మేయడానికి ఉన్న ప్లాట్ ఫాం ఓఎల్ఎక్స్. ఇందులో అమ్మకాలు.. కొనుగోలు జరుగుతుంటాయి. ఎంతో సదుద్దేశంతో ఏర్పాటుచేసిన ఈ సైట్ లో కొన్ని అవకాశాలను నేరస్తులు పట్టుకుని వాటి ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. సైబర్ నేరగాళ్ల బారిన పెద్దసంఖ్యలో ప్రజలు పడుతుండడంతో సైబర్ క్రైమ్ పోలీసులు ఈ సైట్ ను బ్యాన్ చేయాలంటూ ఏకంగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.
ఓఎల్ఎక్స్ సైట్ అమ్మకాలు-కొనుగోళ్లు చేయొద్దని స్వయంగా సైబర్ క్రైమ్ పోలీసులే చెబుతున్నారు. ఈ సైట్ కు దూరంగా ఉండాలని సూచిస్తున్న పరిస్థితి ఏర్పడింది. ఈ సైట్ వలన ఒక్క హైదరాబాద్ పరిధిలోనే రోజుకు 10కి పైగా మోసాలు జరుగుతున్నాయి. వీటిపై కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో సైట్ ను నిషేధించాలని పోలీసులు కోరుతున్నారు.మరి కేంద్రం స్పందన ఎలా ఉంటుందో చూడాలి